Site icon NTV Telugu

Vice President: పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి! వారికి ఛాన్స్ లేనట్లే!

Vice President

Vice President

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఊహించని రీతిలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంత సడన్‌గా రాజీనామా ఎందుకు చేశారంటూ రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. అనారోగ్యం కారణంగా రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో జరిగిందంటూ విపక్షాలు కోడైకూస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల పదవి ఉండగానే ధన్‌ఖర్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Off The Record : ప్రత్యక్ష రాజకీయాల వైపు మల్లారెడ్డి కోడలు అడుగులు?

ఈసారి మిత్రపక్షాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్‌లో అనేకమైన పుకార్లు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా బీహార్‌లో ఈసారి బలం పుంజుకునేందుకు నితీష్ కుమార్‌కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపించాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న హరివంశ్‌కు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ.. బీజేపీకి దగ్గరగా ఉన్న శశిథరూర్‌కు ఆ పదవి కట్టబెట్టొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా రకరకాలైన పేర్లు వ్యాప్తి చెందుతున్నాయి.

ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్‌లో ఎంబసీపై దాడులు.. నకిలీ రాయబారి అరెస్ట్

తాజాగా ఈ ఊహాగానాలకు బీజేపీ చెక్ పెట్టింది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ విధేయులకే ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ భావజాలంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారని చెబుతున్నాయి.

ఇటీవల జేడీయూ నాయకుడు, కేంద్రమంత్రి రామ్‌రాథ్ ఠాకూర్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవిని ఠాకూర్‌కు ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను బీజేపీ వర్గాలు తీవ్రంగా తోసిపుచ్చాయి. సాధారణ సమావేశమే తప్ప.. అందులో విశేషం ఏమీలేదని తేల్చేశాయి. ఆ పదవి గురించే చర్చ జరగలేదన్నారు.

ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులతో ఈ ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్‌లో తెలిపింది.

Exit mobile version