Site icon NTV Telugu

Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన

Modi5

Modi5

పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ చోరీ’ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ‘‘మోడీకి సమాధి తవ్వాలంటూ’’ నినాదాలు చేశారు. ఇదే అంశంపై సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని మోడీని చంపాలనుకుంటున్నారా? అని కమలనాథులు ప్రశ్నించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

Exit mobile version