Bihar: వచ్చే ఏడాదే బీహార్ ఎన్నికలు.. ఎన్డీఏతో నితీష్ వెళ్తారా? లేదా? అమిత్ షా వ్యాఖ్యల అర్థమేంటి?
- వచ్చే ఏడాదే బీహార్ ఎన్నికలు
- ఎన్డీఏతో నితీష్ వెళ్తారా? లేదా?
- అమిత్ షా వ్యాఖ్యల అర్థమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే జేడీయూ ఎన్డీఏ కూటమిలో భాగం ఉంది. నితీష్కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేయగలదా అని అడిగిన ప్రశ్నకు… ‘‘మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాం. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము’’ అని అమిత్ షా గూఢమైన సమాధానం ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీసింది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్కుమార్ ఎన్డీఏకు నాయకత్వం వహిస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. అయితే తాజాగా హర్యానాలోని సూరజ్కుండ్లో జరిగిన రెండు రోజుల కమిటీ సమావేశంలో బీజేపీ కోర్ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఊహాగానాలకు తెరదించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తారని కమలనాథులు ధృవీకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నితీష్ కుమార్కు కూటమి మద్దతుగా ఉంటుందని తేల్చిచెప్పారు. నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని కోర్ కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు ఉండవని.. నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చి చెప్పారు.
Also Read
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- Udhayanidhi Stalin: ‘‘భర్త కోసం భార్య వెతుకుతోంది’’.. విజయ్పై పర్సనల్ అటాక్..
- Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
- CM Vijay: పెరియార్ ఆదర్శమే, కానీ దేవుడిపైనే మా నమ్మకం..
ఇదే వైఖరిని ఇతర సీనియర్ నేతలు కూడా సమర్థించారు. నితీష్ కుమార్ తమ నాయకుడని, ఎలాంటి గందరగోళం లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఐదు కూటమి భాగస్వాములు దీనిపై ఏకాభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM-S) కూడా నితీష్ కుమార్కు మద్దతు ఇచ్చింది. 2025 ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, హెచ్ఏఎం-ఎస్ నేత జితన్రామ్ మాంఝీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
-
Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!