Bihar: వచ్చే ఏడాదే బీహార్ ఎన్నికలు.. ఎన్డీఏతో నితీష్ వెళ్తారా? లేదా? అమిత్ షా వ్యాఖ్యల అర్థమేంటి?
- వచ్చే ఏడాదే బీహార్ ఎన్నికలు
- ఎన్డీఏతో నితీష్ వెళ్తారా? లేదా?
- అమిత్ షా వ్యాఖ్యల అర్థమేంటి?
వచ్చే ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే జేడీయూ ఎన్డీఏ కూటమిలో భాగం ఉంది. నితీష్కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేయగలదా అని అడిగిన ప్రశ్నకు… ‘‘మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాం. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము’’ అని అమిత్ షా గూఢమైన సమాధానం ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీసింది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్కుమార్ ఎన్డీఏకు నాయకత్వం వహిస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. అయితే తాజాగా హర్యానాలోని సూరజ్కుండ్లో జరిగిన రెండు రోజుల కమిటీ సమావేశంలో బీజేపీ కోర్ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఊహాగానాలకు తెరదించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తారని కమలనాథులు ధృవీకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నితీష్ కుమార్కు కూటమి మద్దతుగా ఉంటుందని తేల్చిచెప్పారు. నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని కోర్ కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు ఉండవని.. నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చి చెప్పారు.
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
ఇదే వైఖరిని ఇతర సీనియర్ నేతలు కూడా సమర్థించారు. నితీష్ కుమార్ తమ నాయకుడని, ఎలాంటి గందరగోళం లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఐదు కూటమి భాగస్వాములు దీనిపై ఏకాభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM-S) కూడా నితీష్ కుమార్కు మద్దతు ఇచ్చింది. 2025 ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, హెచ్ఏఎం-ఎస్ నేత జితన్రామ్ మాంఝీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?