Varun Gandhi: ‘ఎగిరే శవపేటికలను ఎప్పుడు వదిలించుకుంటారు’.. వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi: రాజస్థాన్లో బార్మర్ సమీపంలో శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మిగ్-21 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్-21 బలి తీసుకుంది. ఈ పాత కాలపు జెట్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని విరమించుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు భారత వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నిన్న బార్మర్లో జరిగిన ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. కొన్నేళ్లుగా మిగ్-21 తరచుగా ప్రమాదాలకు గురవుతోంది. ఈ విమానం ఇప్పటివరకు దాదాపు 200 మంది పైలట్లను బలిగొంది. ఈ ‘ఎగిరే శవపేటిక’ను వైమానిక దళం విమానాల నుండి ఎప్పుడు తొలగిస్తారు? దేశంలోని పార్లమెంటు ఆలోచించాలి, మన పిల్లలను ఈ విమానాన్ని నడిపేందుకు అనుమతిస్తామా?” అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Pending Cases in Courts: దేశంలో దాదాపు 5కోట్ల కేసులు పెండింగ్.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ భల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. భారత వైమానిక దళం ఈ సెప్టెంబర్ చివరి నాటికి మిగ్-21 విమానాల సేవలను నిలిపివేయాలనుకుటోంది. దాంతో మిగ్ 21 బైసన్ స్క్వాడ్రన్లో మూడు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవి కూడా ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున రిటైర్ అవుతూ 2025 నాటికి పూర్తిగా వైమానిక దళాన్ని వీడనున్నాయని తెలుస్తోంది. వింగ్ కమాండర్ రాణా హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారని, ఫ్లైట్ లెఫ్టినెంట్ భల్ జమ్ము కశ్మీర్కు చెందిన వారని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!