NTV Telugu Site icon

Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం సైనీ పోటీ ఎక్కడనుంచంటే..!

Nayabsinghsaini

Nayabsinghsaini

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. 67 మందితో కూడిన తొలి జాబితాను బుధవారం సాయంత్రం బీజేపీ ప్రకటించిండి. ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు!.. సీట్ల పంపకాలపై తెగని పంచాయితీ

హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్లు పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చాక తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఇక భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Viral : వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులకు మరణశిక్ష