BJP Celebrations: “రారండోయ్ వేడుక చేద్దాం” అంటున్న బీజేపీ. సెలబ్రేషన్స్కి రేపే శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Celebrations: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపటి నుంచి దేశవ్యాప్తంగా పండగ చేసుకోనుంది. ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను మరింత ఉత్సాహంగా నిర్వహించనుంది. సెలబ్రేషన్స్ని ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 25 (సోమవారం) దాక కొనసాగించనుంది. ఎందుకు?, ఏమిటీ? అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్ము దేశ ప్రథమ మహిళ(రాష్ట్రపతి)గా గెలవనున్న నేపథ్యంలో బీజేపీ ఈ వేడుకలకు రంగం సిద్ధం చేసింది.
అత్యున్నత రాజ్యాంగ పదవికి తొలిసారిగా ఒక గిరిజన మహిళను ఎంపిక చేయటం తమ పార్టీకే సాధ్యమైందంటూ బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకోబోతోంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ రిజల్ట్ గురువారం రానుండటంతో ఆ రోజే ఈ క్యాన్వాస్కి శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా దేశంలోని ముఖ్య కూడళ్లలో ప్రత్యేక పోస్టర్లను అంటించనుంది. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి పదవికి నామినేట్ చేసినందుకు ప్రధాని మోడీకి ఘనంగా కృతజ్ఞతలు తెలపనుంది. ఈ మేరకు బీజేపీ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివప్రకాష్ చత్తీస్గఢ్లోని పార్టీ నాయకులతో ఆదివారం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నందున ఆ రోజుతో సెలబ్రేషన్స్ని ముగించనున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు సైతం పార్టీ లీడర్లకు ఈ వేడుకల గురించి వివరించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ‘ఇన్నాళ్లూ సరైన గుర్తింపుకు, ప్రోత్సాహకానికి నోచుకోని వర్గాలకు సరైన అవకాశాలు ఇవ్వాలని, తద్వారా దేశాభివృద్ధిలో వాళ్లకూ భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకున్నాం. ఇలాంటి విధాన నిర్ణయాలను ఎన్నింటినో బీజేపీ ఇప్పటికే అమలుచేస్తోంది.
read more: Uttar Pradesh: సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఎదురుదెబ్బ.. క్యాబినెట్ మంత్రి రాజీనామా
ద్రౌపదీ ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయటం వల్ల గిరిజనుల్లో బీజేపీ పట్ల ఆదరణ తప్పకుండా పెరుగుతుంది’ అని మురళీధర్రావు అన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్ ఓరాన్ మాట్లాడుతూ ఇది గిరిజనులకే కాదు ప్రతిఒక్కరికీ సంతోషంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమని పేర్కొన్నారు. ఎస్టీలే కాకుండా అన్ని వర్గాలవాళ్లూ ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. రాజ్యాంగ విలువలకు పట్టం కడుతున్న విశేష ఉత్సవంగా జరుపుకోవాలని సూచించారు.
కులాలతో, మతాలతో సంబంధంలేకుండా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ద్రౌపదీ ముర్ముకే ఓటేయడానికి ఉత్సాహం చూపించటం శుభపరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా బైక్ ర్యాలీ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కమలదళం ప్రభావం తక్కువనే లోపాన్ని అధిగమించేందుకు దీనికి రూపకల్పన చేసింది. ‘పల్లె గోస-బీజేపీ భరోసా’లో భాగంగా పార్టీ నేతలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించి, ఆ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!