Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- చక్కెర ధరల పెరుగుదలపై బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వింత వ్యాఖ్యలు..
- డయాబెటిస్ పెరగడంతో ప్రజలు తక్కువ చక్కెర తింటున్నారని మంత్రి వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: చక్కెర ధర పెరుగుదలపై బీహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్లో కిలో చక్కెర ధర రూ. 65 దాటింది. గతంలో ఇది సుమారు రూ. 48-50గా ఉండేది. ధరల పెరుగుదలపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందిస్తూ.. చక్కెర ధరలు పెరిగినా ప్రజలపై పెద్ద ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు డయాబెటిస్ కేసులు పెరగడంతో చాలా మంది చక్కెర తీసుకోవడం తగ్గించారని, దీంతో చక్కెర ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రజలు ఇప్పటికే తక్కువ చక్కెర తింటున్నారరి, అందరికి డయాబెటిస్ ఉందని, ఈ రోజుల్లో ఎవరు స్వీట్లు తింటున్నారు..? అని ప్రశ్నించారు. దీని వల్ల చక్కెర ధర పెరిగినా పెద్ద తేడా ఉండదని చెప్పారు. మరోవైపు బీహార్ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ధరల పెరుగుదలపై స్పందించారు. రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధర లభిస్తే తనకు సంతోషంగా ఉంటుందని అన్నారు. అయితే, చక్కెర ధర ఎందుకు పెరిగిందో పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై చక్కెర ఉత్పత్తి శాఖ మంత్రిని వివరాలు కోరుతామని తెలిపారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
ఈ వ్యాఖ్యలపై ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ తీవ్రంగా స్పందించారు. చక్కెర ధరల పెరుగుదకు డయాబెటిస్ కారణంగా చూపడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఆవు పేడలో ఎంత నెయ్యి పోసినా అది ఆవు పేడే. ఇలాంటి మంత్రి నుంచి ఏం ఆశించగలం.?’’ అని అన్నారు. గ్యాస్, టమాటా ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీ సహా పలువురు ప్రముఖ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారని, ఇప్పుడు చక్కెర ధరలు పెరిగితే డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నారని పప్పు యాదవ్ విమర్శించారు. ‘‘అసలు అతిపెద్ద డయాబెటిస్ ప్రభుత్వానికే ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!