Aam Admi Party: గుజరాత్లో ఆప్కి మరో ఝలక్.. బీజేపీకి ఎమ్మెల్యే సపోర్ట్
Bhupat Bhayani Gives Shock To AAP In Gujarat: గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తొలుత అక్కడి ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. 90 సీట్లు సాధిస్తామని ఆ పార్టీ ప్రకటించుకుంటే, కేవలం ఐదు స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తాజాగా ఆ పార్టీకి మరో ఝలక్ తగిలింది. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ ఖండించారు కానీ.. తాను బయటి నుంచి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు తాను బీజేపీలోకి చేరడం లేదన్న ఆయన.. ప్రజలు కోరుకుంటే మాత్రం ఆ పార్టీలోకి చేరుతానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.
Software Employee Killed: సాప్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య.. గొంతు, కాలి నరాలు కోసి
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఓ ఇంటర్వ్యూలో భయానీ మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో ఆప్ను వీడి, బీజేపీలో చేరే ఆలోచన అయితే లేదు. ఒకవేళ ప్రజలు కోరితే మాత్రం, ఆ పార్టీలో చేరుతా. నేనిలా చెప్పడానికి ఓ కారణం ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సంఖ్య ఎలాగూ లేదు. ఎమ్మెల్యేగా నేను కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఫలితంగా.. ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. నేను నెగ్గిన స్థానంలో రైతుల సంఖ్య ఎక్కువ. ఇరిగేషన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. వ్యాపారులు కూడా ఉన్నారు. వాళ్లందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటేనే, సమస్యల్ని పరిష్కరించగలం. లేకపోతే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. పార్టీ మారే విషయంపై నేను ఓసారి ప్రజలను, స్థానిక నేతలను సంప్రదిస్తా’’ అంటూ చెప్పారు.
Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా లుక్ అవుట్
ఈ విధంగా పార్టీ మారే వార్తలపై భయానీ స్పందించడంతో.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘తన పార్టీ తరఫున గెలిచిన వాళ్లందరూ మేలిమి రత్నాలు, ఎవ్వరికీ అమ్ముడుపోరు’’ అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ని తెరమీదకి తెచ్చి, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా.. భూపత్ భయానీ గతంలో బీజేపీలోనే ఉన్నాడు. కానీ, ఎన్నికల సమయంలో రెబల్గా మారారు. ఆప్లో చేరి, జునాగఢ్ జిల్లా విసవాదర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో తాను బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన సేవల్ని గుర్తించి, అక్కడి ప్రజలు తనకు ఓట్లు వేసి ఉండొచ్చని భయానీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!