Bharat Jodo Yatra: “విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్”తో రాహుల్ గాంధీ మరోసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi reunites with ‘Village Cooking Channel”: విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్” దీని గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ప్రారంభం అయిన ఈ యూట్యూబ్ ఛానెల్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. కొంతమంది సభ్యులు అవుట్ డోర్ లొకేషన్లలో చేరే వంటకాలతో చాలా ఫేమస్ అయింది. 2018లో ప్రారంభం అయిన ఈ ఛానెల్ కు ఏకంగా 1.8 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతంలో ఓ సారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో ఈ ఛానెల్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది.
గతేడాది జనవరిలో రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనలో భాగంగా విలేజ్ కుకింగ్ ఛానెల్ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో వారితో వంట చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వారు చేసిన వంటకాలను టేస్ట్ చేశారు. సాంప్రదాయ దక్షిణాది వంటకాలను వండుతూ వాటిని యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేస్తుంటారు. గతేడాది రాహుల్ గాంధీ ఈ కుకింగ్ ఛానెల్ సభ్యులను కలిసినప్పుడు.. రాహుల్ గాంధీ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారని ఛానెల్ నిర్వాహకులు తెగ సంబరపడిపోయారు. రాహుల్ గాంధీ కూడా మా వంటలో చేరారని.. ఈ వీడియో ‘ బిగ్ మూమెంట్’ పేరుతో అప్ లోడ్ చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ మష్రూమ్ బిర్యాణీని టేస్ట్ చేశారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: YS Sharmila: నా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో’ యాత్ర తమిళనాడులో సాగుతోంది. శుక్రవారం మరోసారి విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ సభ్యులతో రాహుల్ మమేకం అయ్యారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో వారు కూడా పాల్గొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. భారత్ జోడో యాత్ర అన్ని సంస్కృతులను కలపడమే అని.. అది భాష కావచ్చు, వంటకాలు కావచ్చని.. విలేజ్ కుకింగ్ ఛానెల్ తో రాహుల్ గాంధీ మరోసారి కలిశారని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కన్యాకుమారి జిల్లాలో కొనసాగింది. శుక్రవారం నాగర్ కోయిల్ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం అయింది. దాదాపుగా 5 నెలల పాటు 3500 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సాగనుంది.
#BharatJodoYatra is to bring cultures together with all aspects of it. Be it the cuisine, the language, or the beliefs.
Shri @RahulGandhi reunited with the Village Cooking Channel and emphasized the value food holds for every culture. pic.twitter.com/AWkbvvne4A
— Congress (@INCIndia) September 9, 2022
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!