Bharat Jodo Yatra: “విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్”తో రాహుల్ గాంధీ మరోసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi reunites with ‘Village Cooking Channel”: విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్” దీని గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ప్రారంభం అయిన ఈ యూట్యూబ్ ఛానెల్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. కొంతమంది సభ్యులు అవుట్ డోర్ లొకేషన్లలో చేరే వంటకాలతో చాలా ఫేమస్ అయింది. 2018లో ప్రారంభం అయిన ఈ ఛానెల్ కు ఏకంగా 1.8 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతంలో ఓ సారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో ఈ ఛానెల్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది.
గతేడాది జనవరిలో రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనలో భాగంగా విలేజ్ కుకింగ్ ఛానెల్ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో వారితో వంట చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వారు చేసిన వంటకాలను టేస్ట్ చేశారు. సాంప్రదాయ దక్షిణాది వంటకాలను వండుతూ వాటిని యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేస్తుంటారు. గతేడాది రాహుల్ గాంధీ ఈ కుకింగ్ ఛానెల్ సభ్యులను కలిసినప్పుడు.. రాహుల్ గాంధీ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారని ఛానెల్ నిర్వాహకులు తెగ సంబరపడిపోయారు. రాహుల్ గాంధీ కూడా మా వంటలో చేరారని.. ఈ వీడియో ‘ బిగ్ మూమెంట్’ పేరుతో అప్ లోడ్ చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ మష్రూమ్ బిర్యాణీని టేస్ట్ చేశారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: YS Sharmila: నా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో’ యాత్ర తమిళనాడులో సాగుతోంది. శుక్రవారం మరోసారి విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ సభ్యులతో రాహుల్ మమేకం అయ్యారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో వారు కూడా పాల్గొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. భారత్ జోడో యాత్ర అన్ని సంస్కృతులను కలపడమే అని.. అది భాష కావచ్చు, వంటకాలు కావచ్చని.. విలేజ్ కుకింగ్ ఛానెల్ తో రాహుల్ గాంధీ మరోసారి కలిశారని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కన్యాకుమారి జిల్లాలో కొనసాగింది. శుక్రవారం నాగర్ కోయిల్ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం అయింది. దాదాపుగా 5 నెలల పాటు 3500 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సాగనుంది.
#BharatJodoYatra is to bring cultures together with all aspects of it. Be it the cuisine, the language, or the beliefs.
Shri @RahulGandhi reunited with the Village Cooking Channel and emphasized the value food holds for every culture. pic.twitter.com/AWkbvvne4A
— Congress (@INCIndia) September 9, 2022
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!