IT Jobs: టెకీల తొలగింపు.. బెంగళూరు టాప్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Jobs: సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ (టెకీల) తొలగింపులో బెంగళూరు టాప్ ప్లేస్లో ఉంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఉన్న నగరంలోనే టెకీల తొలగింపు ఎక్కువగా ఉంది. ఇప్పటికే లేఆఫ్స్డౌన్ ట్రెండ్ కొనసాగుతుండగా… ఇదే పరిస్థితి తిరిగి కొన్ని కంపెనీల్లో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే మరికొంత మంది టెకీలకు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడనుంది. టెకీల తొలగింపు 2022తో పోల్చితే .. 2023 తొలి 6 నెలల్లో అధికంగా ఉన్నట్టు లేఆఫ్స్.ఎఫ్వైఐ సర్వే నివేదికలో వెల్లడయింది.
Also Read
- PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
లేఆఫ్స్ పెరుగుదలతో టెకీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా టెకీల ఉద్వాసన పర్వం ఉధృతమవుతోంది. అమెరికా, ఐరోపాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడంతో ఐటీ, ఇతర కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. ఆర్థికరంగ ఒడిదొడుకుల కారణంగా స్టార్టప్లలో పెట్టుబడుల సంఖ్య కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2,13,020 మంది టెకీలకు ఉద్వాసన (2023, జనవరి నుంచి జూన్) పలికినట్టు లేఆఫ్స్.ఎఫ్వైఐ వెబ్సైట్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది మొత్తంలో 45,166 టెకీలు ఉద్యోగాలు కోల్పో గా.. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో లేఆఫ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులను తొలగించిన జాబితాలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహు, మెటా, జూమ్ ఉన్నాయి.
Read also: Supreme Court: మణిపూర్ ఘటన.. కేంద్ర ప్రభుత్వం పై సుప్రీం సీరియస్
భారత్లో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇండియాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా 10,774 మంది టెకీలను తొలగించినట్టు లేఆఫ్స్.ఎఫ్వైఐ నివేదిక వెల్లడించింది. 2022లో ఉద్వాసనకు గురైన టెకీ ఉద్యోగుల సంఖ్య 6,530 మంది కాగా.. ఈ ఏడాదితో పోల్చి చూసినప్పుడు తొలి ఆరునెలల్లో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నవారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ విజృంభించిన 2020లోనూ భారత్లోని 12,932 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పో యారు. 2021లో కొత్త స్టార్టప్లకు ఫండింగ్ పెరిగింది. దీంతో ఈ సంఖ్య 4,080కు తగ్గింది. టెకీల తొలగింపులో భారత్లో బెంగళూరు మహానగరం మొదటి వరుసలో ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అక్కడ 6,967 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టార్టప్ హబ్గా రూపొందుతున్న క్రమంలో ఈ ప్రభావం అధికంగా పడినట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో లేఆఫ్లు పెద్దగా లేకపోవడంతో లేఆఫ్స్.ఎఫ్వైఐ నివేదికలో టెకీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన గణాంక వివరాలు పొందుపరచలేదు. గత శీతాకాలం నుంచి ఇప్పటిదాకా 107 ఇండియన్ స్టార్టప్లలో 28,046 మంది ఉద్యోగులకు లే ఆఫ్ సెగ తాకినట్టు ఐఎన్సీ 42 తాజా నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 22 భారత ఎడ్టెక్ స్టార్టప్లు 9,871 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని.. 59 స్టార్టప్లు 9,271 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!