కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు. ఈ భేటీలో కూటమిలోని లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే మంగళవారం పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఇక ఖర్గే మాట్లాడుతూ.. మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీని మచ్చిక చేసుకునేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని వ్యా్ఖ్యానించారు.
#WATCH | The meeting of INDIA bloc's Floor Leaders (Lok Sabha & Rajya Sabha) underway at the residence of Congress national president Mallikarjun Kharge.
(Video: AICC) pic.twitter.com/4EaaMy74a8
— ANI (@ANI) July 23, 2024