Flights Delayed: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్పోర్టులోనూ సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన 400 విమానాలు..
- ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లోని ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు..
- రెండు ఎయిర్ పోర్టుల్లో ఇప్పటి వరకు 400కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి..
- త్వరలోనే ఈ సమస్య పరిష్కరం అవుతుందని వెల్లడించిన ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flights Delayed: భారతదేశంలో అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఏటీసీ సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం కొనసాగుతుంది. ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో గురువారం నుంచి విమానాలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 400కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్జెట్ లాంటి ఎయిర్లైన్లు ప్యాసింజర్లకు ముందస్తుగా అలర్ట్ జారీ చేశాయి. ఎయిర్ పోర్టు అధికారులు మాన్యువల్ ప్రక్రియలతో పని మొదలు పెట్టారు. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం మాత్రం కాలేదు. మరోవైపు, ముంబై ఎయిర్ పోర్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో అక్కడి విమానాలపై కూడా ప్రభావితం అయ్యాయి.
Read Also: Pakistan: భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
అయితే, ఎయిర్ పోర్టుల్లో ATC వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టంలో లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ వ్యవస్థ విమానాల ప్రణాళికలను ఆటోమేటిక్ గా సిద్ధం చేస్తుంది. ఈ వ్యవస్థలో సమస్యతో కంట్రోలర్లు మాన్యువల్గా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గురువారం 513 విమానాలు, శుక్రవారం ఉదయం నుంచి 171 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇక, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఏటీసీలో లోపంతో వ్యవస్థ మొత్తం గందరగోళానికి గురైంది. కాగా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్ ప్రక్రియలతో పని చేస్తున్నట్లు తెలుస్తుంది. సాంకేతిక టీమ్లు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది, కానీ విమానాల ఆలస్యాలు కొనసాగవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు బోర్డింగ్ గేట్ల దగ్గర లాంగ్ క్యూలు, టెర్మినల్లలో వేచి చూస్తున్నారు. విమానాల్లో కూడా వెయిటింగ్ లిస్టు పెరిగింది. కాగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో కొన్ని రద్దయ్యాయి.
Chatrapati Shivaji Maharaj International Airport, Mumbai, issues a passenger advisory following flight Operations at Mumbai Airport being affected by a technical issue impacting the Automatic Message Switching System (AMSS) at Delhi, which supports Air Traffic Control flight… pic.twitter.com/McP1jKkkLN
— ANI (@ANI) November 7, 2025
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!