PM Modi: అస్సాం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ విమర్శలను తీవ్రం చేశారు. శనివారం గౌహతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ను ‘‘మావోయిస్ట్-ముస్లిం లీగ్’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎప్పుడూ దేశ భద్రతను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని చొరబాటుదారుల చేతిలోకి వెళ్లేలా చేయాలనుకుంటుందని ఆరోపించారు. దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న వారిని కాంగ్రెస్ గొప్పగా చూపుతోందని అన్నారు.
Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్లో షాట్ కట్ రూట్తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
బీజేపీ వేగంగా అభివృద్ధి చేస్తోందని, చరిత్ర-వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోందని, కానీ కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలతో బిజీగా ఉందని అన్నారు. కాంగ్రెస్ అస్సాంను తిరుగుబాటు, సంఘర్షణలతో నింపిందని, పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీలో విషం నిండిందని, అస్సాంను అశాంతి వైపు తీసుకెళ్లాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు అస్సాంలో గతుకుల రోడ్లు దర్శనమిచ్చేవని, ఇప్పడు రోడ్లపై యుద్ధవిమానాలు ల్యాండ్ అవతున్నాయని మోడీ చెప్పారు.
