Asaduddin Owaisi: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేయడానికి బీజేపీ ఉద్దేశపూర్వక ప్రయత్నమంటూ ఆయన ఆరోపించారు. ‘బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హైదరాబాద్లో శాంతిని చూడాలని బీజేపీ కోరుకోవడం లేదు. వారు ప్రవక్త ముహమ్మద్ను, ముస్లింలను ద్వేషిస్తారు. భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారు.’ అని అసదుద్దీన్ ఒవైసీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కనీసం స్పందించాలని ఆయన అన్నారు. రాజకీయంగా తమతో పోరాడండి కానీ ఇలా కాదన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే స్పందించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారికి తాను చెబుతాను అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహ్మద్ ప్రవక్తపై దైవదూషణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను హైదరాబాద్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295, మరియు 505 కింద దబీర్పురా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు చేసిన వీడియోను విడుదల చేయడంతో సోమవారం అర్థరాత్రి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. బీజేపీ ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బషీర్ బాగ్లోని కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Also Read
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
Kishan Reddy: రాజాసింగ్ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు తెలీదు
దబీర్పురా పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ ప్రకారం.. గత రాత్రి 250 మందికి పైగా ప్రజలు దబీర్పురా పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు గుమిగూడారు, రాజా సింగ్ ప్రవక్త గురించి అవమానకరమైన వీడియోను పంచుకున్నారని. సమాజంలోని మతపరమైన మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. తాము వెంటనే సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆగస్ట్ 20న హైదరాబాద్లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ నిర్వహించిన షోను వ్యతిరేకించడంతో ఆగస్ట్ 19న బీజేపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు భద్రతను పెంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం వెలుపల బలగాలను మోహరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కూడా పెంచారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!