Asaduddin Owaisi: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేయడానికి బీజేపీ ఉద్దేశపూర్వక ప్రయత్నమంటూ ఆయన ఆరోపించారు. ‘బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హైదరాబాద్లో శాంతిని చూడాలని బీజేపీ కోరుకోవడం లేదు. వారు ప్రవక్త ముహమ్మద్ను, ముస్లింలను ద్వేషిస్తారు. భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారు.’ అని అసదుద్దీన్ ఒవైసీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కనీసం స్పందించాలని ఆయన అన్నారు. రాజకీయంగా తమతో పోరాడండి కానీ ఇలా కాదన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే స్పందించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారికి తాను చెబుతాను అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహ్మద్ ప్రవక్తపై దైవదూషణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను హైదరాబాద్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295, మరియు 505 కింద దబీర్పురా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు చేసిన వీడియోను విడుదల చేయడంతో సోమవారం అర్థరాత్రి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. బీజేపీ ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బషీర్ బాగ్లోని కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Kishan Reddy: రాజాసింగ్ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు తెలీదు
దబీర్పురా పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ ప్రకారం.. గత రాత్రి 250 మందికి పైగా ప్రజలు దబీర్పురా పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు గుమిగూడారు, రాజా సింగ్ ప్రవక్త గురించి అవమానకరమైన వీడియోను పంచుకున్నారని. సమాజంలోని మతపరమైన మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. తాము వెంటనే సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆగస్ట్ 20న హైదరాబాద్లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ నిర్వహించిన షోను వ్యతిరేకించడంతో ఆగస్ట్ 19న బీజేపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు భద్రతను పెంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం వెలుపల బలగాలను మోహరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కూడా పెంచారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..