Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..
- నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి..
- ప్రతిపక్ష నేతలు ఏకమైతే 24 గంటల్లో కేజ్రీవాల్ బయటకు..
- బీజేపీ నాయకులు రాజ్యాంగం కన్నా ఎక్కువకారు..
- ఆప్ కార్యకర్తలతో మనీష్ సిసోడియా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో ‘నియంతృత్వ పాలన’కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పిలునిచ్చారు. బీజేపీని టార్గెట్ చేస్తూ, ఈ వ్యక్తులు రాజ్యాంగం కన్నా శక్తివంతులు కారని అన్నారు. నాయకులను జైలులో పెట్టడమే కాకుండా ప్రజల్ని వేధించే ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతీ వ్యక్తి పోరాడాలని అన్నారు.
జైల్లో ఉన్నప్పుడు తనకు బెయిల్ ఎప్పుడు వస్తుందనే ఆలోచన లేదని, అయితే బీజేపీకి డబ్బులు విరాళంగా ఇవ్వనందకు వ్యాపారవేత్తలపై ఫేక్ కేసులు పెట్టి జైలులో పెట్టడం చూస్తుంటే బాధగా ఉందని చెప్పారు. ఈ కేసులో జైలులో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలంతా ఒక్కటైతే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారని అన్నారు.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Read Also: Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?
సిసోడియా మాట్లాడుతూ.. మేము రథానికి గుర్రాలమే, కానీ మా నిజమైన సారథి జైలులో ఉన్నారని త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. తన బెయిల్ తీర్పుపై మాట్లాడుతూ నియంతృత్వాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగం యొక్క అధికారాన్ని ఉపయోగించిందని చెప్పారు. 7-8 నెలల్లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ 17 నెలలు పట్టిందని చెప్పారు. కానీ చివరకు నిజం గెలించిదని అన్నారు. వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హత గురించి నేరుగా ప్రస్తావించకుండా, ఆమె తన నాయకుడికి ఎదురుతిరిగింది, ఒలింపిక్స్లో ఏం జరిగిందో చూశారు కదా అని కార్యకర్తలతో ఆయన అన్నారు. మహిళల 50 కేజీల ఫైనల్కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్పై పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!