CM Yogi: “బుజ్జగింపు రాజకీయ నాయకుల” పవిత్ర స్నానాలు.. అఖిలేష్పై విమర్శలు..
- కుంభమేళాలో అఖిలేష్ యాదవ్ స్నానం..
- బుజ్జగింపు రాజకీయ నేతల స్నానం అంటూ యోగి సెటైర్లు..
CM Yogi: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు.
Read Also: Rahul Gandhi: ఒకప్పుడు చిన్నకారు.. ఇప్పుడు శీష్మహల్.. కేజ్రీవాల్పై రాహుల్గాంధీ విమర్శలు
Also Read
సనాతనాన్ని నమ్మని, కేవలం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే వారు బలవంతంగా స్నానం చేయవలసి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆదివారం అఖిలేష్ యాదవ్ సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని సంగమ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అఖిలేష్ యాదవ్ పుణ్యస్నానం చేసిన తర్వాత తన తండ్రి విగ్రహానికి పూలమాల వేశారు. దీనిపై యోగి మాట్లాడుతూ.. కొందరు మహాకుంభ్ ప్రాముఖ్యతను గుర్తించి ప్రముఖల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని, మనం ఈ విశ్వాసాలను విస్మరిస్తే, విశ్వాసాలు మనల్ని విస్మరిస్తాయని యోగి అన్నారు.
ప్రతిపక్షాల భాగస్వామ్యం సనాతన ధర్మ విజయాన్ని సూచిస్తుందా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై యోగి మాట్లాడుతూ.. ఇది విజయం లేదా ఓటమి గురించి కాదని, ఇది సనాతన ధర్మం యొక్క శాశ్వత శక్తి, ప్రభావాలకు నిదర్శనమని, భారతదేశ విశ్వాసానాలను ఎప్పుడూ గౌరవించని వారు కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అని అన్నారు. గత 15 రోజుల్లో 16 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని చెప్పారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళకి 45 కోట్ల మంది వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!