Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న అన్నామలై.
- ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశాలు.
- పార్టీలో కొనసాగాలని ఒప్పించే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం.
- అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి ప్రధాన కారణమనే ప్రచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.
బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పాదయాత్రతో గ్రామాల నుంచి పట్టణాల వరకు బీజేపీకి ఊపు తెచ్చారు. అయితే, ఎన్నికల ముందు అగ్ర నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అన్నామలై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సొంత పార్టీ ఏర్పాటు చేసి, రాజకీయాల్లో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
అన్నాడీఎంకేతో పొత్తుతో అసంతృప్తి:
కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, ‘‘సింగం’’గా పేరు తెచ్చుకున్నారు. 2020లో బీజేపీలో చేరారు. అనతికాలంలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హాయాంలో బీజేపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది. కానీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతోనే అన్నామలై అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో, పొత్తులో భాగం కావాలంటే అన్నామలైని జాతీయాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని ఎడప్పాడి పళనిస్వామి బీజేపీపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అన్నామలైని తొలగించి నైనార్ నాగేంద్రన్ను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది.
ఇంత చేసినా అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇదే కాకుండా బీజేపీ మొత్తం 234 సీట్లలో కేవలం ఒక స్థానం మాత్రమే సాధించింది. పార్టీ ఓటు శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన శక్తిగా అవతరించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీ ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, జాతీయవాద రాజకీయాలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!