పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. తిరుగులేని శక్తిగా నిలిచింది. 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుంది. 15 ఏళ్ల తృణమూల్ కంచుకోటను కాషాయ పార్టీ పటాపంచల్ చేసింది. ఎన్నో ఏళ్ల బీజేపీ కల నెరవేరింది. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మే 9న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. అమిత్ షాను పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. దీంతో అమిత్ షా కోల్కతాకు వెళ్లబోతున్నారు.
అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్నే సీఎంగా ఎంపిక చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే పలువురు మహిళల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహిళా సెంటిమెంట్ పాటిస్తారా? లేదంటే సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా? అన్నది సస్పెన్ష్గా ఉంది. ఇదిలా ఉంటే కోల్కతాలో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షమిక్ భట్టాచార్య, సుకాంత మజుందార్ హాజరయ్యారు
