Live in Relationships: సహజీవనం తప్పేమీకాదు.. జంటలకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు
- లివింగ్ రిలేషన్ షిప్ తప్పేమీ కాదు
- మహిళలను ప్రశాంతంగా జీవించనివ్వండి
- జంటలకు రక్షణ కల్పించాల్సిందేనన్న హైకోర్టు
వివాహ బంధానికి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సమాజం అంగీకరించదు. ఈ మధ్య వివాహేతర సంబంధాలు కారణంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలిసిందే. పడక సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే కడతేరుస్తున్న రోజులవి. ఇలాంటి తరుణంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘‘లివింగ్ రిలేషన్ షిప్’’ ఏ మాత్రం తప్పు కాదని.. మహిళల ప్రశాంత జీవనానికి భంగం కలిగించొద్దని సూచించింది. జంటలకు రక్షణ కల్పించాల్సిందేనని పోలీసులకు ఆదేశిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
Also Read
- TVK Vijay: "ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర".. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
సహజీవనం చేస్తున్న 12 జంటలు తమకు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లివింగ్ రిలేషన్ షిప్ సంబంధాలను చట్టవిరుద్ధం అని చెప్పలేమని పేర్కొంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేనంతమాత్రాన కలిసి జీవించడం ఏ మాత్రం నేరం కాదని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. లివిన్ రిలేషన్షిప్లో ఉన్న 12 మంది మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను కోర్టు ఆదేశించింది. మహిళల ప్రశాంత జీవనానికి ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సిందని సూచించింది. ఈ తీర్పు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Obama: ఈ ఏడాది ఒబామాను మెప్పించిన సినిమాలు ఇవే!
‘‘మైనర్ లేదా మేజర్. వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా జీవించే హక్కు ఉందని.. దీన్ని చాలా ఉన్నత స్థాయిలో పరిగణించాలి. పిటిషనర్లు వివాహం చేసుకోలేదనే విషయం వాస్తవం. భారత రాజ్యాంగంలో భారత పౌరులుగా జీవించే ప్రాథమిక హక్కు వారికి ఉంది.’’ అని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. విద్యావంతులైన మహిళలు సొంత ఇష్ట ప్రకారం జీవించాలని అనుకున్నవాళ్లకు పోలీసులు రక్షణ కల్పించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్కు ముందు కీలక అప్డేట్!
-
Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?