Akhilesh Yadav: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, సమాజ్వాదీ(ఎస్పీ)లు ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీ నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించాలని ఆయన యువతకు స్పష్టంగా పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఇటీవల యువత ఆందోళనలు, యూపీలో ప్రస్తుత పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారస్తామని బీజేపీ చెబుతోందని, కానీ రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పించలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం యువత, విద్యపై దృష్టి పెట్టి ఉంటే, వారికి ఉపాధి లభించేదని, గత 9 ఏళ్లుగా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారు, నిండబోతున్నవారు ఈ పరిస్థితిని గమనించాలని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడా పాల్గొనలేదని అన్నారు. యూపీ చరిత్రలోనే ఇది అత్యంత అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. బీజేపీ చారిత్రాత్మక కనౌజ్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.
क्या किसान को ‘1 रुपये किलो’ आलू की क़ीमत देने से बनेगी ‘1 ट्रिलियन’ डॉलर की इकोनॉमी।
ये है ‘डील की ढील’ का परिणाम
हैरान-परेशान है देश का किसानवाह रे मुख्यमंत्री जी! pic.twitter.com/JWQOMpCkQZ
— Akhilesh Yadav (@yadavakhilesh) August 11, 2026

