ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.. కానీ, కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి.
Read Also: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ఇక, గత నెలలో అఖిలేష్ యాదవ్ పశ్చిమ యూపీలో నిర్వహించాల్సిన ర్యాలీని కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. ఆయన భార్య మరియు కుమార్తె కరోనా బారినపడ్డారు.. ఆ తర్వాత మూడు రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించి.. కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.. ఇదే సందర్భంలో తనకు కోవిడ్ నెగటివ్గా వచ్చిన రిపోర్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు.. కోవిడ్ కేసులు పెరగడం, థర్డ్ వేవ్ దృష్ట్యా యూపీలో పెద్ద ర్యాలీలను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. కోవిడ్, ఒమిక్రాన్ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసింది. యూపీతో పాటు త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ మాస్ ర్యాలీలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.. తమ రాష్ట్రాల్లోని కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయాలని, ఆపై ర్యాలీలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గౌతంబుద్ధ్ నగర్ జిల్లాలో జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు..
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!