Air India : తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఎయిరిండియా టైం అస్సలు బాలేదుగా..!

  • ఫుకెట్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం
  • విమాన ముందరి చక్రం మొరాయించడంతో ఉద్రిక్త పరిస్థితి
  • రన్‌వే ఐదు గంటల పాటు మూసివేత
  • ప్రయాణికులందరూ సురక్షితమని ఎయిర్ ఇండియా ప్రకటన
Air India

Air India

Air India Express incident Phuket : భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానం బుధవారం థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం ముందు చక్రం (Nose Wheel)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఢిల్లీ నుండి ఫుకెట్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, ల్యాండింగ్ సమయంలో రన్‌వేపైకి రాగానే దాని ముందు చక్రం మొరాయించింది. విమానం రన్‌వే మధ్యలోనే నిలిచిపోవడంతో ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయ అధికారులు తక్షణమే రన్‌వేను మూసివేసి, విమానాన్ని అక్కడి నుండి తొలగించే ప్రక్రియను చేపట్టారు.

Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు

ఈ సాంకేతిక లోపం కారణంగా ఫుకెట్ విమానాశ్రయం రన్‌వే సుమారు ఐదు గంటల పాటు మూతపడింది. దీనివల్ల ఫుకెట్‌కు రావాల్సిన , అక్కడి నుండి వెళ్లాల్సిన డజన్ల కొద్దీ విమానాలు రద్దయ్యాయి, కొన్ని దారి మళ్లించబడ్డాయి. వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. విమానాన్ని సురక్షితంగా రన్‌వే నుండి తొలగించిన తర్వాతే అధికారులు రాకపోకలను పునరుద్ధరించారు.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందిస్తూ, ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొంది. విమానంలో ఉన్న ప్రయాణికులు , సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, వారికి అవసరమైన సహాయం అందిస్తున్నామని వెల్లడించింది. సాంకేతిక లోపానికి గల కారణాలపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!