Operation Sindoor: యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి నేర్చుకోండి: వైమానిక దళాధిపతి..
- యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి నేర్చుకోవాలి..
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వైమానిక దళాధిపతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక సంఘర్షణ ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో భారతదేశం నుంచి నేర్చుకోవాలని అన్నారు.
Read Also: CM Revanth Reddy : ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్ కుటుంబంలో సమస్య
Also Read
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
‘‘నేడు జరుగుతున్న ప్రధాన యుద్ధాలు, అది రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే ఎవరూ సంఘర్షణ ముగింపు గురించి ఆలోచించడం లేదు. వీలైనంత త్వరగా సంఘర్షణల్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే దాని గురించి ప్రపంచం భారత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను’’ అని ఢిల్లీలో ఒక కార్యక్రమంలో అన్నారు.
పాకిస్తాన్పై దాడి ఆపడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు తప్పుపట్టారు. మే 10న కాల్పులు విమరణపై ట్రంప్ ఒత్తిడి ఉందని, నరేంద్రమోడీ లొంగిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, దీనిపై కూడా ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేము చాలా త్వరగా యుద్ధాన్ని ముగించాము, మన లక్ష్యం ఉగ్రవాద వ్యతిరేకత, వారిపై దాడి చేశాము, కాబట్టి మన లక్ష్యాలను నెరవేరాయి. ఇంకా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏంటి? ఏదైనా సంఘర్షణకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, పురోగతిని ప్రభావితం చేస్తుంది.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?