Abhijit Deepke: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ నిరసన తెలుపుతోంది. మరోవైపు, ఇదే డిమాండ్తో ప్రముఖ కార్యకర్త సోనమ్వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సోనమ్వాంగ్ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. దీంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఒక మహిళ సిరా విసరడంతో మరింత గందరగోళం చెలరేగింది. దీపక్ వేదికపై నుంచి నిరసనకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటన తర్వాత ఇంక్ దాడికి పాల్పడిన మహిళలను పోలీసులకు అప్పగించారు. పోలీసులు మహిళను విచారిస్తున్నారు. ఈ దాడిపై దీప్కే స్పందిస్తూ, తనకు ఇష్టమైన కలర్ బ్లూ అని, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం తర్వాత తక్షణమే తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఎక్స్లో దీప్కే ప్రకటించారు. జూలై 20న జరగాల్సిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉందని, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల దృష్ట్యా, నిపుణులైన వైద్యుల సలహా మేరకు ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిరసన స్థలాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
Blue is my colour… Jai Bhim! pic.twitter.com/SItr64em29
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 18, 2026

