CJP Protest: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వేదికపై మాట్లాడుతూ.. దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను మాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దీప్కే మాట్లాడుతూ.. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని నన్ను హీరోగా చేయొద్దు. ఒకరిని హీరోగా చేయడం వల్లే దేశానికి నష్టం జరిగింది’’ అన్నారు. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వానికి తలొగ్గకపోతే, మనం ఎవరితోనైనా రాజీనామా చేయించగలమనడానికి ప్రధాన్ రాజీనామానే నిదర్శనమని, భయపడాల్సిన అవసరం లేదని, ఇదే ప్రజాస్వామ్యం అని అన్నారు.
తన ప్రసంగంలో ఎక్కడా కూడా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి సోనమ్ వాంగ్చుక్ పేరు చెప్పకపోవడం విశేషం. దీప్కే అమెరికా నునంచి భారత్ వచ్చిన తర్వాత జంతర్ మంతర్ వద్ద కొంత మంది సహాయకులు తప్పా వేరే వ్యక్తులు లేని సమయంలో, అతడిని సోనమ్ వాంగ్చుక్ మద్దతు తెలిపారు. ప్రారంభంలో జనం తక్కువగా ఉండటంతో, వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. చివరకు ప్రభుత్వం 20 రోజలు నిరాహార దీక్ష తర్వాత , జూలై 18న వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. ఆ తర్వాత ఆయన గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రికి మారారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.

