US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- ఆర్ఎస్ఎస్ సంబంధిత నిధుల్ని తీసుకోం..
- 90 మంది అమెరికా నేతల ప్రతిజ్ఞ..
- తప్పుబడుతున్న హిందూ సంఘాలు..
- మోహన్ భగవత్ పర్యటన తర్వాత వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Politics: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆ దేశంలోని కొన్ని సంస్థలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని నిషేధించాలని పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాలు తీసుకోబోమని కనీసం 90 మంది అమెరికా రాజకీయ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. వీరిలో భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఆగస్టు 31న ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యాక్షన్’ వంటి సంస్థలు ఈ ప్రతిజ్ఞను ప్రకటించాయి. డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన పలువురు నేతలు దీనిపై సంతకాలు చేశారు.
ఆర్ఎస్ఎస్ నుంచి విరాళాలు తీసుకోబోమని, ఇప్పటికే ఒకవేళ తీసుకుంటే వాటిని తిరిగి ఇచ్చేయడం లేదా ప్రజస్వామ్యానికి మద్దతు ఇచ్చే సంస్థలకు మళ్లించడం వంటివి చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలు మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో వచ్చాయి. ఆగస్టు 29న న్యూయార్క్లోని మాడిసన్ స్వ్కేర్ గార్డెన్లో ‘యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Also Read
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
భగవత్ పర్యటనను అమెరికాలోని రాజకీయ, పౌర హక్కుల సంస్థలు వ్యతిరేకించాయి. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. తాజాగా తీసుకువచ్చిన ప్రతిజ్ఞపై సంతకం చేసిన వారిలో మిచిగాన్కు చెందిన సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్, వాషింగ్టన్కు చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్, కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, ఇల్లినాయిస్కు చెందిన ప్రతినిధి రాబిన్ కెల్లీ తదితరులు ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ ‘రైట్ వింగ్’ సంస్థగా అభివర్ణించిన ప్రమీలా జయరాజ్, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే సంస్థల్ని యూఎస్లో తిరస్కరించాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ అమెరికా ఎన్నికల్ని ప్రభావితం చేయకూడదని రోఖన్నా అన్నారు. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న బిలినీయర్ నుంచి ఇటీవల తాను స్వీకరించిన విరాళాలను తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఈ ప్రచారంపై హిందూ-అమెరికన్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమాన్ని వివక్షాపూరితమైనవిగా అభివర్ణించాయి. అమెరికా విలువలకు విరుద్ధంగా ఉందని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎండీ సుహాగ్ ఏ శుక్లా అన్నారు.
తాజావార్తలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!