Cloudburst: జమ్మూకాశ్మీర్లో మళ్లీ క్లౌడ్బరస్ట్.. ఏడుగురు మృతి
- జమ్మూకాశ్మీర్లో మళ్లీ క్లౌడ్బరస్ట్
- ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. కథువాలో ఆకస్మిక వరదలు కారణంగా ఏడుగురు చనిపోయారు. జోధ్ ఘాటిలో వరదలు కారణంగా ఐదుగురు చనిపోతే.. జాంగ్లోట్లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!
Also Read
శనివారం-ఆదివారం మధ్య రాత్రి సమయంంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఒక రైల్వే ట్రాక్, జాతీయ రహదారి-44, ఒక పోలీస్ స్టేషన్ కూడా తాజా వరదల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. వెంటనే సైన్యం, పారామిలిటరీ దళాలు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కథువా సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ఇది కూడా చదవండి: UP: మీరట్లో దారుణం.. జవాన్ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది
ఇక మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. కథువా జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండటానికి సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కథువా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు నదులు, వాగులు, నహల్లాలు, ఇతర నీటి వనరుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. ఇతర ప్రమాద ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 63 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఆగస్టు 14న మచైల్ మాతా ఆలయానికి వార్షిక తీర్థయాత్ర కోసం చిసోటిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు ఈ విషాదం సంభవించింది. కనీసం 82 మంది ఇంకా ఆచూకీ తెలియలేదు. ఈ యాత్ర జూలై 25న ప్రారంభమై సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉంది.
#IndianArmy Columns on the ground in #Kathua — rescuing families, giving hope, food & care after the #Cloudburst. @adgpi@westerncomd_IA@prodefencejammu@JmuKmrPolice pic.twitter.com/Z5K0uriQ7b
— Rising Star Corps_IA (@RisingStarCorps) August 17, 2025
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!