Explosion in fireworks godown: బాణాసంచా గోడౌల్ లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

Tamil Nadu Incident

Tamil Nadu Incident

5 Killed In Fire At Fireworks Godown In Madurai: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం మధురై జిల్లాలోని తిరుమంగళం లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా సింధుపట్టి పోలీసులు వెల్లడించారు.

Read Also: Gujarat Elections: రవీంద్ర జడేజా భార్యకు… మోర్బీ ఘటనలో ప్రజల్ని కాపాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్

×
×
Ad

శిథిలాల లోపల మరిన్ని మృతదేహాలు చిక్కుకునే అవకాశాలు ఉన్నందున మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి చాలా మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతుల గుర్తింపు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ గోడౌన్ లో బాణాసంచా తయారీతో పాటు స్టోరేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. క్రాకర్స్ తయారీకి లైసెన్సు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంతో ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు తెల్లవారుజామున మాల్దీవుల్లోని గ్యారేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది మరణించారు. ఇందులో 8 మంది భారతీయులే ఉన్నారు. మవేయో మసీదు సమీపంలోని ఎం నిరుఫెహి ప్రాంతంలో అర్థరాత్రి 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై సంతాపాన్ని వ్యక్తం చేసింది.