భారత్ లో కరోనా కేసులు నేడు తగ్గాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 30,093 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,74,322 కి చేరింది. ఇందులో 3,03,53,710 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,06,130 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 374 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,14,482 మంది మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 45,254 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.
భారత్ కరోనా : భారీగా తగ్గిన కేసులు…
corona