Indian Airforce: బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Airforce: ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్లోకి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినందుకు గాను ముగ్గురు భారత వైమానిక దళ అధికారులను తొలగించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. “ఒక బ్రహ్మోస్ క్షిపణి అనుకోకుండా 09 మార్చి 2022న ప్రయోగించబడింది. కేసును విచారించడానికి ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (కల్నల్) ఘటనకు బాధ్యులుగా ముగ్గురు అధికారులను సేవలను నుంచి తప్పించారు. ఆ అధికారులు ప్రమాదవశాత్తు క్షిపణిని పేల్చారు’’ అని వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
“ఈ ముగ్గురు అధికారులు ఈ ఘటనకు ప్రాథమికంగా బాధ్యత వహించారు. వారి సేవలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. 23 ఆగస్టు 2022న అధికారులపై తొలగింపు ఉత్తర్వులు అందించబడ్డాయి” అని ఆ ప్రకటనలో వైమానిక దళం పేర్కొంది. ఈ క్షిపణిని మార్చిలో పాకిస్తాన్లోని ఒక ప్రాంతంలో అనుకోకుండా భారతదేశం వైపు నుండి ప్రయోగించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు సాంకేతిక లోపం అని తెలిపింది.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
పాకిస్తాన్ ప్రకారం.. క్షిపణి తమ గగనతలంలోకి 100 కి.మీ కంటే ఎక్కువ దూరంతో పాటు 40,000 అడుగుల ఎత్తులో, ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఎగిరిందని పేర్కొంది. క్షిపణిపై వార్హెడ్ లేకపోవడంతో అది పేలలేదు. ఇస్లామాబాద్లో భారతదేశం ఛార్జ్ డి’అఫైర్స్ను పిలిపించి.. దాని గగనతలంలో ఉల్లంఘన జరిగినట్లు ఆ దేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ప్రయాణీకుల విమానాలకు, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని పాకిస్థాన్ కోరింది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే అసహ్యకరమైన పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్ను హెచ్చరించింది.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!