Indian Airforce: బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Airforce: ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్లోకి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినందుకు గాను ముగ్గురు భారత వైమానిక దళ అధికారులను తొలగించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. “ఒక బ్రహ్మోస్ క్షిపణి అనుకోకుండా 09 మార్చి 2022న ప్రయోగించబడింది. కేసును విచారించడానికి ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (కల్నల్) ఘటనకు బాధ్యులుగా ముగ్గురు అధికారులను సేవలను నుంచి తప్పించారు. ఆ అధికారులు ప్రమాదవశాత్తు క్షిపణిని పేల్చారు’’ అని వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
“ఈ ముగ్గురు అధికారులు ఈ ఘటనకు ప్రాథమికంగా బాధ్యత వహించారు. వారి సేవలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. 23 ఆగస్టు 2022న అధికారులపై తొలగింపు ఉత్తర్వులు అందించబడ్డాయి” అని ఆ ప్రకటనలో వైమానిక దళం పేర్కొంది. ఈ క్షిపణిని మార్చిలో పాకిస్తాన్లోని ఒక ప్రాంతంలో అనుకోకుండా భారతదేశం వైపు నుండి ప్రయోగించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు సాంకేతిక లోపం అని తెలిపింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
పాకిస్తాన్ ప్రకారం.. క్షిపణి తమ గగనతలంలోకి 100 కి.మీ కంటే ఎక్కువ దూరంతో పాటు 40,000 అడుగుల ఎత్తులో, ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఎగిరిందని పేర్కొంది. క్షిపణిపై వార్హెడ్ లేకపోవడంతో అది పేలలేదు. ఇస్లామాబాద్లో భారతదేశం ఛార్జ్ డి’అఫైర్స్ను పిలిపించి.. దాని గగనతలంలో ఉల్లంఘన జరిగినట్లు ఆ దేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ప్రయాణీకుల విమానాలకు, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని పాకిస్థాన్ కోరింది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే అసహ్యకరమైన పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్ను హెచ్చరించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!