Site icon NTV Telugu

Terror Attack In J&K: జమ్మూకాశ్మీర్లో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి..

Jammu

Jammu

Terror Attack In J&K: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25) శ్రీనగర్‌లోని జెవీసీ ఆసుపత్రి బెమీనాలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా, ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సహరాన్‌పూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే, సోఫియాన్, ఉస్మాన్ అనే కార్మికులు జలశక్తి శాఖలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. ఇక, కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత 12 రోజుల్లో సెంట్రల్ కశ్మీర్‌లో స్థానికేతరులపై ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి.

Read Also: Israel Hezbullah Conflict : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి.. భారీ మొత్తంలో కూలిన భవనాలు.. 45 మంది మృతి

అయితే, ఇంతకు ముందు.. జమ్మూ కాశ్మీర్‌లో స్థానికేతరులపై దాడి గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడితో పాటు ఆరుగురు వలస కార్మికులు మరణించిన 12 రోజులు అయింది. ఆ ఘటనలో దాడికి గురైన డాక్టర్, కార్మికులు సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని గగనీర్‌ను సోనామార్గ్‌కు కలిపే Z-మోర్హ్ సొరంగంపై పని చేస్తున్న నిర్మాణ బృందంలో భాగం. అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. తరచుగా వలస కార్మికులపై ఉగ్రదాడులు జరగడంపై భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Exit mobile version