UKSSSC Paper Leak Case: యూకేఎస్ఎస్సెస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 18 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UKSSSC Paper Leak Case: ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ (UKSSSC) పేపర్ లీక్ కేసుకు సంబంధించి జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్ సింగ్ అరెస్టుతో ఉత్తరాఖండ్ పోలీసులు ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశారు.”ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసులో జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్ సింగ్ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనతో కలిపి 18 మందిని అరెస్ట్ చేశారు.” అని ఉత్తరాఖండ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన ఎస్సెస్పీ అజయ్ సింగ్ వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని మోరీ ప్రాంతంలో హకమ్ సింగ్ పట్టుబడ్డాడు. జిల్లా పంచాయతీ సభ్యుడిని అరకోట్ చౌకీ వద్ద అడ్డుకున్నారు. హకమ్ సింగ్ ఆగస్టు 7న విదేశీ పర్యటన నుంచి దేశానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ వివాదంలో కఠిన చర్యలు తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదివారం కమిషన్ కార్యదర్శిని తొలగించింది.సచివాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం.. పీసీఎస్ అధికారిణి షాలినీ నేగీని పరీక్షల నియంత్రణాధికారిగా, సెక్రటేరియట్ సర్వీసెస్ జాయింట్ సెక్రటరీ సురేందర్ రావత్ను కమిషన్లో కార్యదర్శిగా నియమించారు.సబార్డినేట్ కమిషన్ యొక్క వివిధ పరీక్షల రిక్రూట్మెంట్లో అవకతవకలు వెల్లడి అయిన తరువాత, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కఠినమైన చర్యలకు ఆదేశించారు, ఆ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్టు చేసింది.
Also Read
India Map With Human Chain: మానవహారంతో ఇండియా మ్యాప్.. ప్రపంచ రికార్డును సాధించిన ఇండోర్
ఈ ఏడాది జూలై 22న రాయ్పూర్ పోలీస్ స్టేషన్లో పేపర్ లీక్ కేసులో కేసు నమోదైంది. దీనిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణ జరుపుతోంది.ఆరోపించిన అక్రమాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేయబడింది. గ్రాడ్యుయేషన్ స్థాయి రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై డెహ్రాడూన్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు, ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు రాష్ట్ర సెక్రటేరియట్లోని పబ్లిక్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అదనపు ప్రైవేట్ సెక్రటరీ గౌరవ్ చౌహాన్ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత, పోలీసు హెడ్క్వార్టర్స్ కేసు దర్యాప్తును ప్రత్యేక టాస్క్ ఫోర్స్కి అప్పగించింది.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ విచారణకు ఆదేశించారు.
ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ గత సంవత్సరం (2021) డిసెంబర్ 4, 5 తేదీలలో రాత పరీక్షను నిర్వహించింది. వివిధ విభాగాలకు చెందిన 13 కేటగిరీల పోస్టులను భర్తీ చేయాల్సిన 854 పోస్టులకు ఇది అతిపెద్ద పరీక్ష.
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!