UKSSSC Paper Leak Case: యూకేఎస్ఎస్సెస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 18 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UKSSSC Paper Leak Case: ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ (UKSSSC) పేపర్ లీక్ కేసుకు సంబంధించి జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్ సింగ్ అరెస్టుతో ఉత్తరాఖండ్ పోలీసులు ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశారు.”ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసులో జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్ సింగ్ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనతో కలిపి 18 మందిని అరెస్ట్ చేశారు.” అని ఉత్తరాఖండ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన ఎస్సెస్పీ అజయ్ సింగ్ వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని మోరీ ప్రాంతంలో హకమ్ సింగ్ పట్టుబడ్డాడు. జిల్లా పంచాయతీ సభ్యుడిని అరకోట్ చౌకీ వద్ద అడ్డుకున్నారు. హకమ్ సింగ్ ఆగస్టు 7న విదేశీ పర్యటన నుంచి దేశానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ వివాదంలో కఠిన చర్యలు తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదివారం కమిషన్ కార్యదర్శిని తొలగించింది.సచివాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం.. పీసీఎస్ అధికారిణి షాలినీ నేగీని పరీక్షల నియంత్రణాధికారిగా, సెక్రటేరియట్ సర్వీసెస్ జాయింట్ సెక్రటరీ సురేందర్ రావత్ను కమిషన్లో కార్యదర్శిగా నియమించారు.సబార్డినేట్ కమిషన్ యొక్క వివిధ పరీక్షల రిక్రూట్మెంట్లో అవకతవకలు వెల్లడి అయిన తరువాత, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కఠినమైన చర్యలకు ఆదేశించారు, ఆ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్టు చేసింది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
India Map With Human Chain: మానవహారంతో ఇండియా మ్యాప్.. ప్రపంచ రికార్డును సాధించిన ఇండోర్
ఈ ఏడాది జూలై 22న రాయ్పూర్ పోలీస్ స్టేషన్లో పేపర్ లీక్ కేసులో కేసు నమోదైంది. దీనిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణ జరుపుతోంది.ఆరోపించిన అక్రమాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేయబడింది. గ్రాడ్యుయేషన్ స్థాయి రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై డెహ్రాడూన్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు, ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు రాష్ట్ర సెక్రటేరియట్లోని పబ్లిక్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అదనపు ప్రైవేట్ సెక్రటరీ గౌరవ్ చౌహాన్ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత, పోలీసు హెడ్క్వార్టర్స్ కేసు దర్యాప్తును ప్రత్యేక టాస్క్ ఫోర్స్కి అప్పగించింది.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ విచారణకు ఆదేశించారు.
ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ గత సంవత్సరం (2021) డిసెంబర్ 4, 5 తేదీలలో రాత పరీక్షను నిర్వహించింది. వివిధ విభాగాలకు చెందిన 13 కేటగిరీల పోస్టులను భర్తీ చేయాల్సిన 854 పోస్టులకు ఇది అతిపెద్ద పరీక్ష.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!