కరోనా కల్లోలం.. భారత్లో లక్ష దాటేసిన రోజువారి కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో మళ్లీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది… గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో రోజువారి కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఇక, ఇవాళ ఏకంగా లక్ష మార్క్ను దాటేసి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 302 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కోవిడ్ కేసులు సంఖ్య 3,71,363కి పెరిగాయి.. అత్యధికంగా మహారాష్ట్రలోనే 36,265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక, ఇదే సమయంలో 30,836 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా కేసులతో కలుపుకుంటే డైలీ కేసుల పాజివిటీ రేటు 7.74 శాతానికి పెరిగింది.. యాక్టిక్ కేసులు 3,71,363గా ఉన్నాయి.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,73,845గా పెరగగా.. దేశవ్యాప్తంగా కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,83,178కు పెరిగింది.. మరోవైపు 23 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 2,630కు చేరింది.. ఇక, దేశవ్యాప్తంగా 149.66 కోట్ల కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం పేర్కొంది.
Also Read
- Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
- Uttar Pradesh: బీజేపీ "మిషన్ యూపీ 2027" స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
- Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్కు అపాయింట్మెంట్
Read Also: ప్రత్యేక బస్సుల్లో ఏంటి ఈ దోపిడి..?
తాజావార్తలు
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!