Road Accident: సీఎం ర్యాలీకి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E Shinde Dussehra Rally: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ నిరవహించారు. ఈ నేపథ్యంలో ఆయన ర్యాలీకి హాజరు అయిన ప్రజలు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైయ్యారు.. వివరాలలోకి వెళ్తే.. ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ కి వెళ్లి ప్రజలతో తిరిగి వస్తున్న ప్రైవేట్ బస్సు థానే జిల్లాలో ప్రమాదానికి గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ముంబై-నాసిక్ హైవేపై కొలంబే వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో బస్సు డివైడర్పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో మరో బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
కాగా ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా రోడ్డుపైన ప్రమాదానికి గురైన బస్సును తొలిగించేందుకు క్రేన్లను ఉపయోగించాల్సి వచ్చింది. కాగా ఈ బస్సు నాసిక్ జిల్లా లోని సిలోడ్కు వెళ్తోందని.. ఆసమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు. కాగా అందరు కూడా షిండే దసరా ర్యాలీకి వెళ్లి వస్తున్న ప్రజలే అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదం లో ప్రయాణికులు గాయపడ్డారని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?