NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో కూలిన ఆస్పత్రి భవనం.. ఒకరి మృతి

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. సెక్టార్ 12 ద్వారకలోని నిర్మాణంలో ఆస్పత్రి భవనం కూలి ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం సంఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, పూణె, యూపీ లాంటి నగరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నీళ్లలో నానడంతో పలు పాత ఇళ్లులు కూలిపోతున్నాయి.

ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య