Jeethu Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ సిరీస్కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళం, తెలుగులో ‘దృశ్యం-3’ రిలీజ్ అయిన మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ ఎందుకు కాలేదో డైరెక్టర్ జీతూ జోసెఫ్ వెల్లడించారు. వాస్తవానికి గతంలో వచ్చిన రెండు పార్ట్స్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ మూడో పార్ట్ మాత్రం మోహన్లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన దృశ్యం -3 నే తెలుగులో కూడా విడుదల చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తాజాగా డైరెక్టర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ఇతర భాషల్లోని స్టార్ హీరోల ఇమేజ్, వారికున్న ఫాలోయింగ్ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మలయాళంలో మోహన్లాల్ క్యారెక్టరైజేషన్కు, తెలుగులో ఉండే హీరోల ఇమేజ్కు ఉన్న వ్యత్యాసాల వల్లే తెలుగు రీమేక్ సాధ్యం కాలేదని వెల్లడించారు. తెలుగు రీమేక్ క్యాన్సిల్ అయినప్పటికీ, హిందీలో మాత్రం ‘దృశ్యం-3’ రీమేక్ కాబోతోందని జీతూ జోసెఫ్ వెల్లడించారు. బాలీవుడ్ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. “హిందీ మేకర్స్ ఇప్పటికే రైట్స్ తీసుకున్నారు. అయితే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి, హీరో ఇమేజ్కు తగ్గట్టుగా క్లైమాక్స్ మార్చుకుంటామని నన్ను మర్యాదపూర్వకంగా అడిగారు. దానికి నేను కూడా సంతోషంగా అంగీకరించాను” అని జీతూ జోసెఫ్ వెల్లడించారు. దీంతో హిందీలో అజయ్ దేవగన్ హీరోగా ‘దృశ్యం-3’ రావడం పక్కా అయిపోయింది.

