తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్యగాయకులు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ ఉంటాము. అయితే అది కూడా సత్యదూరమే! సాక్ష్యాధారాల ప్రకారం మన తొలి నేపథ్యగాయకుడు మాస్టర్ సాబు. అలాగే తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అని తేలుతోంది. సాంకేతికంగా చూసినా వీరిద్దరే మన తొలి నేపథ్యగాయకులు.
అసలు కథ…
Also Read
- CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
1941లో వచ్చిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో ఒక రేడియో పద్యం వుంది. అది రామారావు పాడిందే. కానీ అది ప్లేబ్యాక్ పాట అనిపించుకోదు. కారణం ప్లేబ్యాక్ అంటే తెరమీద ఒక పాట గాని, పద్యం గాని సన్నివేశంలో నటించే నటుడికి వెనుకనుంచి గొంతు అరువిచ్చేది అని అర్థం. ఎం.ఎస్.రామారావు ‘తహసిల్దార్’ (1944) సినిమాలో హెచ్. ఆర్. పద్మనాభశాస్త్రి సంగీత దర్శకత్వంలో కమలా కొట్నిస్ (రజని పాత్రలో) తో కలిసి ”ప్రేమలీలా మోహనకలసి చేకొనుమా కలసి- రాగమయీ మన జీవనసరణి భోగమనోహరమా, రాగదే రజనీ” అనే పాటలో సి.చ్. నారాయణరావు (తాసీల్దార్ పాత్రలో) కు ప్లేబ్యాక్ పాడారు. అదే ఎం.ఎస్. రామారావు పాడిన తొలి ప్లేబ్యాక్ పాట. నిజానికి ఈ సినిమా కంటే ముందే అంటే 1939 ఏప్రిల్ 1న విడుదలైన వాహినీ వారి ‘వందేమాతరం’ సినిమాలో “పూలో- పూలో- పూలో కనీ కొనుడు- పూలూ, మల్లె, మాలతి, జాజీ, గులాబీలు, విరాజాజీ, కనకాంబరి, సంపంగీ నీలాంబరి… ” అంటూ పాట పాడిన మాస్టర్ సాబు తొలి నేపథ్య గాయకుడు. చిత్తూరు.వి. నాగయ్య సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ పాటను రోడ్డు మీదే ‘లైవ్’ గా రికార్డు చేశారు. కానీ అది సరిగ్గా రికార్డు కాలేదు. అప్పుడు శబ్దగ్రాహకుడు శేఖర్, ఛాయాగ్రాహకుడు రామనాథ్ కలిసి ఈ పాటను మాస్టర్ సాబు చేత స్టూడియోలో మరలా పాడించి మాస్టర్ కృష్ణ నటించిన పాటమీద సూపర్ ఇంపోజ్ చేసి ఎడిటింగ్ చేశారు. నిజానికి సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడంతో ఈ పాట లిప్ సింక్ కాలేదు. అందుచేత అందుబాటులోవున్న రికార్డులపరంగా తొలి నేపథ్య గాయకునిగా మాస్టర్ సాబు అని గుర్తించాల్సి వుంటుంది.
చరిత్ర తెలుసుకుంటే…
ఇక తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతీదేవి అని అందరూ అనుకుంటారు. తొలి నేపథ్య గాయని బెజవాడ రాజరత్నం అని గ్రహించాలి. తెలుగు టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో నేపథ్య గాయకులు, నేపథ్య గాయనీమణులు అంటూ ఎవరూ వుండేవారు కాదు. నటీనటులే సొంతంగా పాడుకునేవారు. ఇంకొక్క అడుగు ముందుకు వెళితే…. రావు బాలసరస్వతి ఇల్లాలు(1940) సినిమాలో సాలూరు రాజేశ్వరరావు తో కలిసి “కావ్యపానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలాన్ని తిరిగొచ్చినానే” (హచ్చిన్ వారి రికార్డు నంబరు S.N.832), ”సుమకోమల కనులేల” అనే రెండుపాటల్ని పాడారు. అయితే ఈ పాటలకు అభినయం ఆవిడే కనుక అది నేపథ్య గీతం అనిపించుకోదు. 07-01-1943 న కె.వి.రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారి ‘భక్తపోతన’ సినిమా విడుదలైంది. అందులో భోగిని అనే నర్తకి కల్యాణి రాగంలో ఒక జావళి పాడుతూ నాట్యం చేస్తుంది. “ఇది మంచి సమయము రారా చలమేల చేసేవేరా” అనే ఆ పాటను బెజవాడ రాజరత్నం పాడగా సామ్రాజ్యం అనే నర్తకి మీద చిత్రీకరించారు. అదే తెలుగు సినిమాలో తొలి నేపథ్య గీతం. ఆ విధంగా బెజవాడ రాజారత్నం తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. అయితే ఇక్కడ మరో సంఘటన కూడా గుర్తు చేయాలి. 04-03-1943 న శ్రీ రేణుకా వారి ‘భాగ్యలక్ష్మి’ సినిమా విడుదలైంది. అందులో నాగయ్య, మాలతి, సూర్యకుమారి, కృష్ణన్, గౌరీపతి శాస్త్రి, మధురం, కమలాకోట్నిస్ తారాగణం. సముద్రాల పాటలు లిఖించగా భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇందులో కమలా కొట్నిస్ ‘కుంజీ’ అనే జిప్సీ యువతిగా నటించింది. ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా… తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా” అనే పాటకు కమలాకొట్నిస్ నాట్యం చేస్తుంది. ఈ పాటను బెజవాడ రాజరత్నం ఆలపించారు. అలాగే జిప్సీల కోరస్ పాట “కులుకుత పలకయే కుకాలుగా” లో కూడా బెజవాడ రాజరత్నం తన గొంతును వినిపించారు. ఇదే సినిమాలో సుమతి(కమల) అనే అమ్మాయి ”చేస్తాను పెండ్లికొడుకును చేస్తాను…ముస్తాబు మా అన్నకు నేనే చేస్తాను”అనే పాట పాడుతుంది. సినిమాలో సుమతి పాడగా రికార్డు కోసం ఆ పాటను రావు బాలసరస్వతి చేత పాడించారు. ఆరోజుల్లో విడుదలైన గ్రామఫోను రికార్డులో ఒకవైపు బెజవాడ రాజరత్నం పాడిన ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా…తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా”పాట వుండగా రెండో వైపు బాలసరస్వతి పాడిన ”చేస్తాను పెండ్లికొడుకును చేస్తాను…ముస్తాబు మా అన్నకు నేనే చేస్తాను”వుంటుంది. అలా తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అవుతారు కానీ, రావు బాలసరస్వతీ దేవి కారు. ఈ విషయాన్ని గతంలో వి.ఎ.కె.రంగారావు ధ్రువీకరించగా, రావి కొండలరావు ఏకీభవించారు. చరిత్ర వక్రీకరణకు గురి కాకూడదన్నదే ఈ సుదీర్ఘ వివరణకు కారణం.

తాజావార్తలు
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..