తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్యగాయకులు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ ఉంటాము. అయితే అది కూడా సత్యదూరమే! సాక్ష్యాధారాల ప్రకారం మన తొలి నేపథ్యగాయకుడు మాస్టర్ సాబు. అలాగే తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అని తేలుతోంది. సాంకేతికంగా చూసినా వీరిద్దరే మన తొలి నేపథ్యగాయకులు.
అసలు కథ…
Also Read
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
1941లో వచ్చిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో ఒక రేడియో పద్యం వుంది. అది రామారావు పాడిందే. కానీ అది ప్లేబ్యాక్ పాట అనిపించుకోదు. కారణం ప్లేబ్యాక్ అంటే తెరమీద ఒక పాట గాని, పద్యం గాని సన్నివేశంలో నటించే నటుడికి వెనుకనుంచి గొంతు అరువిచ్చేది అని అర్థం. ఎం.ఎస్.రామారావు ‘తహసిల్దార్’ (1944) సినిమాలో హెచ్. ఆర్. పద్మనాభశాస్త్రి సంగీత దర్శకత్వంలో కమలా కొట్నిస్ (రజని పాత్రలో) తో కలిసి ”ప్రేమలీలా మోహనకలసి చేకొనుమా కలసి- రాగమయీ మన జీవనసరణి భోగమనోహరమా, రాగదే రజనీ” అనే పాటలో సి.చ్. నారాయణరావు (తాసీల్దార్ పాత్రలో) కు ప్లేబ్యాక్ పాడారు. అదే ఎం.ఎస్. రామారావు పాడిన తొలి ప్లేబ్యాక్ పాట. నిజానికి ఈ సినిమా కంటే ముందే అంటే 1939 ఏప్రిల్ 1న విడుదలైన వాహినీ వారి ‘వందేమాతరం’ సినిమాలో “పూలో- పూలో- పూలో కనీ కొనుడు- పూలూ, మల్లె, మాలతి, జాజీ, గులాబీలు, విరాజాజీ, కనకాంబరి, సంపంగీ నీలాంబరి… ” అంటూ పాట పాడిన మాస్టర్ సాబు తొలి నేపథ్య గాయకుడు. చిత్తూరు.వి. నాగయ్య సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ పాటను రోడ్డు మీదే ‘లైవ్’ గా రికార్డు చేశారు. కానీ అది సరిగ్గా రికార్డు కాలేదు. అప్పుడు శబ్దగ్రాహకుడు శేఖర్, ఛాయాగ్రాహకుడు రామనాథ్ కలిసి ఈ పాటను మాస్టర్ సాబు చేత స్టూడియోలో మరలా పాడించి మాస్టర్ కృష్ణ నటించిన పాటమీద సూపర్ ఇంపోజ్ చేసి ఎడిటింగ్ చేశారు. నిజానికి సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడంతో ఈ పాట లిప్ సింక్ కాలేదు. అందుచేత అందుబాటులోవున్న రికార్డులపరంగా తొలి నేపథ్య గాయకునిగా మాస్టర్ సాబు అని గుర్తించాల్సి వుంటుంది.
చరిత్ర తెలుసుకుంటే…
ఇక తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతీదేవి అని అందరూ అనుకుంటారు. తొలి నేపథ్య గాయని బెజవాడ రాజరత్నం అని గ్రహించాలి. తెలుగు టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో నేపథ్య గాయకులు, నేపథ్య గాయనీమణులు అంటూ ఎవరూ వుండేవారు కాదు. నటీనటులే సొంతంగా పాడుకునేవారు. ఇంకొక్క అడుగు ముందుకు వెళితే…. రావు బాలసరస్వతి ఇల్లాలు(1940) సినిమాలో సాలూరు రాజేశ్వరరావు తో కలిసి “కావ్యపానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలాన్ని తిరిగొచ్చినానే” (హచ్చిన్ వారి రికార్డు నంబరు S.N.832), ”సుమకోమల కనులేల” అనే రెండుపాటల్ని పాడారు. అయితే ఈ పాటలకు అభినయం ఆవిడే కనుక అది నేపథ్య గీతం అనిపించుకోదు. 07-01-1943 న కె.వి.రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారి ‘భక్తపోతన’ సినిమా విడుదలైంది. అందులో భోగిని అనే నర్తకి కల్యాణి రాగంలో ఒక జావళి పాడుతూ నాట్యం చేస్తుంది. “ఇది మంచి సమయము రారా చలమేల చేసేవేరా” అనే ఆ పాటను బెజవాడ రాజరత్నం పాడగా సామ్రాజ్యం అనే నర్తకి మీద చిత్రీకరించారు. అదే తెలుగు సినిమాలో తొలి నేపథ్య గీతం. ఆ విధంగా బెజవాడ రాజారత్నం తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. అయితే ఇక్కడ మరో సంఘటన కూడా గుర్తు చేయాలి. 04-03-1943 న శ్రీ రేణుకా వారి ‘భాగ్యలక్ష్మి’ సినిమా విడుదలైంది. అందులో నాగయ్య, మాలతి, సూర్యకుమారి, కృష్ణన్, గౌరీపతి శాస్త్రి, మధురం, కమలాకోట్నిస్ తారాగణం. సముద్రాల పాటలు లిఖించగా భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇందులో కమలా కొట్నిస్ ‘కుంజీ’ అనే జిప్సీ యువతిగా నటించింది. ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా… తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా” అనే పాటకు కమలాకొట్నిస్ నాట్యం చేస్తుంది. ఈ పాటను బెజవాడ రాజరత్నం ఆలపించారు. అలాగే జిప్సీల కోరస్ పాట “కులుకుత పలకయే కుకాలుగా” లో కూడా బెజవాడ రాజరత్నం తన గొంతును వినిపించారు. ఇదే సినిమాలో సుమతి(కమల) అనే అమ్మాయి ”చేస్తాను పెండ్లికొడుకును చేస్తాను…ముస్తాబు మా అన్నకు నేనే చేస్తాను”అనే పాట పాడుతుంది. సినిమాలో సుమతి పాడగా రికార్డు కోసం ఆ పాటను రావు బాలసరస్వతి చేత పాడించారు. ఆరోజుల్లో విడుదలైన గ్రామఫోను రికార్డులో ఒకవైపు బెజవాడ రాజరత్నం పాడిన ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా…తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా”పాట వుండగా రెండో వైపు బాలసరస్వతి పాడిన ”చేస్తాను పెండ్లికొడుకును చేస్తాను…ముస్తాబు మా అన్నకు నేనే చేస్తాను”వుంటుంది. అలా తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అవుతారు కానీ, రావు బాలసరస్వతీ దేవి కారు. ఈ విషయాన్ని గతంలో వి.ఎ.కె.రంగారావు ధ్రువీకరించగా, రావి కొండలరావు ఏకీభవించారు. చరిత్ర వక్రీకరణకు గురి కాకూడదన్నదే ఈ సుదీర్ఘ వివరణకు కారణం.

తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!