డిఫరెంట్ జోనర్ సినిమాలతో తనదైన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇతనికి క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట! తన కూతురు ఐశ్వర్య అర్జున్నే ఇందులో కథానాయికగా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అర్జున్ సర్జా ఒక గొప్ప నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా! ఈయన 1994లో ‘జై హింద్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది తెలుగు, తమిళ భాషల్లో హిట్టయ్యింది. 2002లో బాలయ్య ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని ‘ఎళుమళై’గా రీమేక్ చేసి, విజయం సాధించాడు. 2014లో వచ్చిన ‘జై హింద్ 2’ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తన దర్శకత్వంలో విశ్వక్ సేన్తో ఓ సినిమా చేసేందుకు యాక్షన్ కింగ్ రంగం సిద్ధం చేస్తున్నాడు. దీన్ని.. తెలుగు – తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని, దర్శకుడిగా తన ప్రతిభ చాటేందుకు యాక్షన్ కింగ్ ఈ సినిమాకి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యాడని ఇన్సైడ్ న్యూస్! త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుందని సమాచారం. ఇదిలావుండగా.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విశ్వక్, త్వరలోనే హిందీలో దర్శకుడిగా తెరంగేట్రం చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టిన విషయం తెలిసిందే!