టాలీవుడ్ ప్రముఖుల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అనుభవించమని ఒకరంటే… పిరికితనం అంటూ మరొకరు విరుచుకుపడుతున్నారు. సాధారణంగా టాలీవుడ్లోని దర్శకులు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు. ఎప్పుడూ పబ్లిక్గా గొడవలకు దిగరు. తమకు విభేదాలు వచ్చినా ప్రైవేట్గానే సాల్వ్ చేసుకుంటారు. కానీ బహిరంగ వేదికపై పోరుకు దిగరు. అయితే తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య కొన్ని విభేదాలున్నాయని అర్థమవుతోంది.
గత రాత్రి రవి ఒక ట్వీట్ చేసాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్టుగా అన్పిస్తోంది. “అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది” అని రవి ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ ఇద్దరి మధ్య రచ్చకు కారణమైంది. వెంటనే ఈ ట్వీట్ కు హరీష్ శంకర్ స్పందిస్తూ “అనుభవించమని ఇచ్చారా ??” అని ప్రశ్నించాడు. అలా స్టార్ట్ అయ్యి, నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ రచ్చ ఏంటో వాళ్ళ ట్వీట్స్ లోనే చూడండి.
