NTV Telugu Site icon

Jai Hanuman: హనుమంతుడిగా ఈ ఇద్దరిలో ఒకరు కనిపిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ కంపిస్తుంది

Hanuman

Hanuman

తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తుంది. జనవరి 12న రిలీజైన హనుమాన్ 200 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్లో అవ్వలేదు. ఈ వారం కూడా హనుమాన్ సినిమా హవా కొనసాగనుంది. ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించిన కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ… తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘జై హనుమాన్’ సినిమా హనుమాన్ మూవీ ఎండింగ్ లోనే అనౌన్స్ చేసాడు. హనుమాన్ క్లైమాక్స్ లోనే జై హనుమాన్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ… అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట రోజున జై హనుమాన్ ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పేసాడు. మీ అందరి ప్రేమాభిమానాలతో జై హనుమాన్ స్టార్ట్ చేస్తున్నాను అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు.

2025 సంక్రాంతికి జై హనుమాన్ సినిమా వస్తుందని చెప్పిన ప్రశాంత్ వర్మ… ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. తేజ సజ్జ ఉంటాడు కానీ అతను హీరో కాదు హనుమంతుడే హీరో, ఒక పెద్ద స్టార్ హనుమాన్ గా కనిపిస్తాడు అని ప్రశాంత్ వర్మ చెప్పాడు. దీంతో ఇప్పుడు హనుమాన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయ్యింది. ఎక్కువమంది సినీ అభిమానులు మాత్రం హనుమాన్ గా రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లలో ఒకరు నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ కి ఉన్న దైవ భక్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘హనుమాన్ మాల’ వేసుకున్నాడు. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరు హనుమంతుడిగా నటించినా కూడా ‘జై హనుమాన్’ సినిమా రీచ్ కి మాటల్లో చెప్పడం కష్టం. అయితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ 2025 సంక్రాంతికే రిలీజ్ అంటున్నాడు కాబట్టి చరణ్, ఎన్టీఆర్ లకి ఉన్న కమిట్మెంట్స్ దృష్టిలో పెట్టుకోని ఆలోచిస్తే ఈ ఇద్దరూ నటించడం కష్టమనే చెప్పాలి. మరి జై హనుమాన్ సినిమాపైన ఉన్న నమ్మకంతో ఈ ఇద్దరిలో ఒకరు తమకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ని అడ్జస్ట్ చేసుకోని జై హనుమాన్ సినిమా చేస్తారేమో చూడాలి.