Site icon NTV Telugu

‘మానాడు’ ట్రైలర్ విడుదల చేసిన నాని

కోలీవుడ్ నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. తెలుగులో ‘ది లూప్’ పేరుతో వస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ముగిసింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశారు. దీపావళి సందర్బంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version