NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?

God Of War

God Of War

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ప్రకటించిన మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ‘గాడ్ ఆఫ్ వార్’  సినిమా చుట్టూ అప్పుడే వివాదం మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలైన కొద్ది గంటల్లోనే నెట్టింట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది . అయితే ఈ సినిమా ప్రకటన తమిళ తంబిలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్యాప్షన్. లార్డ్ మురుగన్‌ను ఉద్దేశిస్తూ.. “ఉత్తరాదిన జన్మించి, దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఇది విశ్వానికి చెప్పాల్సిన కథ” అని రాసుకొస్తూ పోస్ట్ చేసారు. ఈ వ్యాఖ్యలపై తమిళ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కుమారస్వామి తమిళ సంస్కృతి, చరిత్ర, మరియు భాషలతో విడరాని బంధాన్ని కలిగి ఉన్నారని, చరిత్రను మార్చే ప్రయత్నం చేయవద్దంటూ మేకర్స్‌ను హెచ్చరిస్తున్నారు. మరోవైపు, లార్డ్ మురుగన్ కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న దేవుడని నెటిజన్లు సినిమా అభిమానులు గుర్తు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి కేవలం ఒక పోస్టర్ మాత్రమే వచ్చిందని అసలు కథ ఏంటో తెలియకుండా అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మురుగన్ నార్త్ లో జన్మించారా? తమిళనాడు లో జన్మించారా? అన్నది పరిశీలిస్తే ఇప్పుడంటే నార్త్, సౌత్ అని వేరు చేసి మాట్లాడుతున్నాం కానీ పురాణాల కాలం నాడు హిందూ సామ్రాజ్యం చాలా విశాలం కదా. సమస్త భారతం ఒక్కటే కదా ఇన్ని భాగాలు లేవు కదా. అలాంటప్పుడు అసలు ఇలాంటి వివాదాలు అర్థరహితమని కామెంట్స్ చేస్తున్నారు.