టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈ సినిమాతో ఈయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు…ఇక ఈ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ ను అందుకున్నాడు.ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ హీరో గా ఎనిమల్ అనే సినిమాని తెరకేక్కుస్తున్నాడు.
ఇందులో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్ సందీప్… ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని తెలుగు ప్రేక్షకుల కి బాగా దగ్గరైన రణబీర్ కపూర్ ఇప్పుడు ‘ఎనిమల్’ చిత్రం తో మరోసారి తెలుగు ప్రేక్షకులు ని పలకరించబోతున్నట్లు సమాచారం..తెలుగు తో పాటుగా తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుందని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సంగతి ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది, అది ఏమిటంటే ఈ సినిమాని మొదట సందీప్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలి అనుకున్నాడని సమాచారం.కానీ మహేష్ బాబు ఈ చిత్రం లో వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం తో సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మొట్టమొదట సందీప్ రెడ్డి వంగ సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రమే కలిసి కథ కనిపించిన్నట్లు సమాచారం..ఆయన తో సినిమా చెయ్యాలి అనేది సందీప్ రెడ్డి వంగ కోరిక అని తెలుస్తుంది.,ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదలైన ప్రీ టీజర్ ని చూసిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమా మిస్ అయ్యాం అని ఫ్యాన్స్ కూడా ఎంతో బాధపడుతున్నారు.ఇక ఈ సినిమా కాకపోయినా భవిష్యతులో అయినా మహేష్ బాబు తో సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.