సైనికులకు తెలుగు చిత్రసీమ ఘన నివాళులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులు కన్నుమూసిన విషయం తెలిసింది. వారికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది. బాంబే రవి స్వరకల్పనలో వెలువడిన జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… ”దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మనలను కవ్విస్తుంటే, మన సైన్యం యాక్షన్ తీసుకోవాలో వద్దో అని సందిగ్ధంలో ఉండేవారు, అధికారుల అనుమతి కోసం ఎదురుచూసే వారు. ప్రసుతం కేంద్ర ప్రభుత్వం ఎవరి అనుమతి అవసరం లేకుండా అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి అని బిపిన్ రావత్ సైన్యానికి మనో ధైర్యాన్ని ఇచ్చి సర్జికల్ స్ట్రైక్ చేశారు. మన సైన్యం పాకిస్థాన్ లోపలికి వెళ్లి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి మళ్ళీ మన దేశానికి రావడం పట్ల బిపీన్ రావత్ సహకారం ఎంతో ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు అజయ్ కుమార్, తెలుగు ఫిల్మ్ పెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, ఈవిఎన్ చారి, కాట్రగడ్డ సుధాకర్, శివరామ్ రెడ్డి , బాంబే రవి, ఇంద్ర మోహన్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం