Site icon NTV Telugu

Taapsee Pannu: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ…

Whatsapp Image 2023 06 17 At 8.26.32 Am

Whatsapp Image 2023 06 17 At 8.26.32 Am

ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలలో అలరించి హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్ లలో తాప్సీ కూడా ఒకరు .మంచు మనోజ్ నటించిన ఝమ్మంది నాదం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది తాప్సీ. తొలి సినిమా తోనే తన నటనతో మరియు గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో వరుసగా రెండు సినిమా ల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్ తో మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్ళింది.అక్కడ పలు సినిమా అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు బాగానే విజయం సాధించింది.హిందీలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అందరిని బాగా మెప్పించింది.

అలాగే స్టార్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ తో మాటల యుద్ధం కూడా జరిగింది.. అలా బాలీవుడ్ లో తాప్సీ కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ సౌత్ సినిమాలు కూడా చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ బాలీవుడ్ పై పలు ఆరోపణలు కూడా చేసింది ఈ ఆరోపణల పై స్పందిస్తూ తాప్సీ కూడా బాలీవుడ్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది . ఒక సినిమా లో ఏ ఏ పాత్రలకు ఎవరిని తీసుకోవాలో కొంతమంది నటీనటులు డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చింది ఈ భామ.టాలెంట్ ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ కు సూట్ అయ్యేవాళ్ళను అయితే కాకుండా.తమ స్నేహితులను అలాగే ఏజెన్సీ వాళ్ళను రిఫర్ చేస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటాయని సంగతి తెలిసిందే..బాలీవుడ్ లో అవకాశాలు కోసం తిరుగుతున్న వారికీ అంతగా రావని తెలిపింది తాప్సీ.

Exit mobile version