విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన సినిమాటోగ్రాఫర్ శివ కాంబినేషన్లో నూతన చిత్రం ప్రారంభమైంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్, స్టూడియో గ్రీన్తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. ‘మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, భాగమతి’ లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. ‘సాహో, రాధే శ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది.
ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్తో సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. త్రీడీలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఏకంగా పది భాషల్లో విడుదల కాబోతోంది. సినిమా షూటింగ్ నూ ప్రారంభించిన చిత్ర బృందం శుక్రవారం మోషన్ పోస్టర్ ను వడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
