NTV Telugu Site icon

SSMB29: మహేష్ బాబు సినిమలో విలన్ గా మలయాళం స్టార్ హీరో..?

1

1

SSMB29 Latest News: ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలయేది ఎప్పుడో కానీ విల్ల ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రెండేళ్ల కావస్తున్నా SSMB29 మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. అని అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB29 ను అధికారికంగా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పాలంటే.. షూటింగ్ ముందు చేయాల్సిన పనులు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే, ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హలచల్ చేస్తుంది. ఈ చిత్రంలో మహేష్ కు ధీటైన విలన్ కోసం రాజమౌళి వెతుకుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ విలన్ దొరికేసాడని టాక్ నడుస్తోంది.

Also Read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం జాక్ పాట్ కొట్టాడు.. ఏకంగా అలాంటి సినిమాతో!!

హీరోగా, విలన్ గా తనదైన నటనతో అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను జక్కన్న విలన్ గా కన్ఫర్మ్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ నటనకు మెచ్చి.. జక్కన్న SSMB29లో కీలకమైన విలన్ రోల్ లో పృథ్వీరాజ్ అయితే బావుంటుందని ఇదే ఈ విషయంపై రాజమౌళి – పృథ్విరాజ్ మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయని. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ మోస్ట్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడట అంతేకాకుండా హీరో మరియు విలన్ మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు రాజమౌళి చాలా కొత్తగా చూపించనున్నారు. ఓ సాధారణ విలన్ పాత్రను పృథ్విరాజ్ ఈ చిత్రంలో చేయడం లేదు అని ఆ పాత్రకు సొంతంగా బ్యాక్‍స్టోరీ ఉంటుంది అని రాజమౌళి, మహేశ్ బాబుతో తొలిసారి పని చేయనుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది అని పృథ్విరాజ్ వ్యక్తం చేశారు అని పింక్‍‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.