Siddharth: తెలుగులో వీడి సినిమా ఎవరు చూస్తారని అడిగారు… స్టేజ్ మీదే ఏడ్చేసిన సిద్దార్థ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth turns emotional and rolls on tears at stage టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారు అంటూ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు. ఈమధ్యనే తమిళంలో చిత్త అనే సినిమా చేసిన సిద్ధార్థ్ ఆ సినిమాను కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇదని విమర్శకులు సైతం కొనియాడారు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా అప్పుడే రిలీజ్ చేయాలనుకున్నా ఎవరూ కొనకపోవడంతో ఎట్టకేలకు ఈ వారం రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ ఎమోషనల్ అయ్యాడు.
Tiger Nageswara Rao: పీఎం సెక్యూరిటీకే వణుకు పుట్టించిన టైగర్ నాగేశ్వరరావు
Also Read
- Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
తమిళనాడులో రెడ్ జెయింట్ వాళ్ళు సినిమా చూసి ఇలాంటి గొప్పసినిమా చూడలేదని ఉదయనిధి
సినిమా కొన్నాడు. కేరళలో నెంబర్ 1 నిర్మాత గోకులం గోపాలం గారు సినిమా చూసి కొన్నారు, కర్ణాటకలో కేజీఎఫ్ సినిమా నిర్మాతలు సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదని నా సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. కానీ తెలుగు విషయానికి వస్తే సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని అడిగారు, సిద్ధార్థ్ సినిమా ఎందుకు చూస్తారు అండి, ఎవరు చూస్తారు అని అడిగారు. నేను ఒక మంచి సినిమా చూస్తే ప్రేక్షకులు నా సినిమా చూస్తారని నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఇది 28న రిలీజ్ కావాల్సిన సినిమా అని అన్నారు. ఆ సినిమా తెలుగు ప్రేక్షుకులు ఎందుకు చూస్తారు, ఎవరూ చూడరని తెలిసి నాకు కరెక్టుగా థియేటర్లు దొరకలేదు. ఆ టైంలో నాకు వచ్చి నేను నీతో ఉన్నానని చెప్పి నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసింది ఏషియన్ సునీల్ గారు అని అంటూ సిద్ధార్థ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కంటే మంచి సినిమా నేను తీయలేను, దయచేసి సినిమా థియేటర్లకు వచ్చి సినిమా చూడండని కోరారు.
తాజావార్తలు
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..