Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej Reveals Interesting Things About Virupaksha: రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్.. త్వరలోనే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈసారి తాను చేసిన రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాయి తేజ్ సరికొత్త త్రిల్లింగ్ సబ్జెక్ట్తో త్రిల్ చేయబోతున్నాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే.. ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇది ఈనెల 21వ తేదీన రిలీజ్కి ముస్తాబవుతున్న తరుణంలో.. చిత్రబృందం ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేసింది.
Rainbow: రెయిన్బోకి ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదు.. ఎవరో తెలుసా?
Also Read
- Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
- Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
- Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
- Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఆదివారం రాత్రి ‘క్యారెక్టర్స్ ఇంట్రో ఈవెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తొలుత తాను అందరి దీవెనలు, ప్రార్థనలతో తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని స్పష్టం చేశాడు. అనంతరం.. ఈ సినిమా స్క్రిప్ట్ వినాల్సిందిగా మొదట తనని సుకుమార్ 2019లో రికమెండ్ చేశాడని చెప్పాడు. సుకుమార్ చెప్పడంతో తాను ఈ స్టోరీ విన్నానని.. కార్తిక్ నరేషన్ వినగానే ఈ చిత్రం తప్పకుండా బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకం తనకు కలిగిందని తెలిపాడు. విరూపాక్ష ఒక గొప్ప సినిమా అని పేర్కొన్న సాయి తేజ్.. ఈ చిత్రం కోసం ఒక అద్భుతమైన ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసినందుకు టెక్నికల్ టీమ్పై ప్రశంసలు కురిపించాడు. ఇక అంజనీష్ లోక్నాథ్ సమకూర్చిన సంగీతం విని, తాను అతనికి అభిమానిని అయ్యానన్నాడు.
Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!
ఇక విరూపాక్షలో నటించిన తన తోటి నటీనటులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారని.. ఇందులో కీలక పాత్రలు పోషించిన నటీనటుల స్మారకార్థం ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగిందని సాయి తేజ్ స్పష్టం చేశాడు. డైలాగ్ డెలివరీలో తన పర్సనల్ టీమ్ ఎంతో సహాయం చేసిందని.. దర్శకుడు సుకుమార్ కూడా తనకు సపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందంటూ తన ప్రసంగాన్ని సాయి తేజ్ ముగించాడు. కాగా.. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించాయి.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!