Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej Reveals Interesting Things About Virupaksha: రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్.. త్వరలోనే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈసారి తాను చేసిన రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాయి తేజ్ సరికొత్త త్రిల్లింగ్ సబ్జెక్ట్తో త్రిల్ చేయబోతున్నాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే.. ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇది ఈనెల 21వ తేదీన రిలీజ్కి ముస్తాబవుతున్న తరుణంలో.. చిత్రబృందం ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేసింది.
Rainbow: రెయిన్బోకి ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదు.. ఎవరో తెలుసా?
Also Read
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఆదివారం రాత్రి ‘క్యారెక్టర్స్ ఇంట్రో ఈవెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తొలుత తాను అందరి దీవెనలు, ప్రార్థనలతో తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని స్పష్టం చేశాడు. అనంతరం.. ఈ సినిమా స్క్రిప్ట్ వినాల్సిందిగా మొదట తనని సుకుమార్ 2019లో రికమెండ్ చేశాడని చెప్పాడు. సుకుమార్ చెప్పడంతో తాను ఈ స్టోరీ విన్నానని.. కార్తిక్ నరేషన్ వినగానే ఈ చిత్రం తప్పకుండా బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకం తనకు కలిగిందని తెలిపాడు. విరూపాక్ష ఒక గొప్ప సినిమా అని పేర్కొన్న సాయి తేజ్.. ఈ చిత్రం కోసం ఒక అద్భుతమైన ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసినందుకు టెక్నికల్ టీమ్పై ప్రశంసలు కురిపించాడు. ఇక అంజనీష్ లోక్నాథ్ సమకూర్చిన సంగీతం విని, తాను అతనికి అభిమానిని అయ్యానన్నాడు.
Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!
ఇక విరూపాక్షలో నటించిన తన తోటి నటీనటులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారని.. ఇందులో కీలక పాత్రలు పోషించిన నటీనటుల స్మారకార్థం ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగిందని సాయి తేజ్ స్పష్టం చేశాడు. డైలాగ్ డెలివరీలో తన పర్సనల్ టీమ్ ఎంతో సహాయం చేసిందని.. దర్శకుడు సుకుమార్ కూడా తనకు సపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందంటూ తన ప్రసంగాన్ని సాయి తేజ్ ముగించాడు. కాగా.. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!