Rithu Chowdhary: రీతూ మార్ఫింగ్ వీడియోలు.. నాతో వస్తావా.. రేట్ ఎంత అని అడుగుతున్నారట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rithu Chowdhary: సీరియల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టి జబర్దస్త్ లో ఎంటర్ అయ్యి ఫేమస్ అయిన నటి రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్యనే రీతూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై రీతూ మొదటిసారి స్పందించింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె మాట్లాడుతూ.. తన ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారని, ఆ వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపింది. ఆ వీడియోలను నాకే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారని, సోషల్ మీడియాలో తానేం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగి దాదాపు ఐదు నెలలు అయినా కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? అని తనలో తానే చాలాసార్లు బాధపడ్డానని, బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయానని చెప్తూనే.. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించానని కానీ చేయక తప్పడం లేదని చెప్పుకొచ్చింది.
ఇక తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ గురించి కూడా ఆమె మాట్లాడింది. తాను, శ్రీకాంత్ బయటికి వెళ్ళినప్పుడు ఈ వీడియోల గురించి చెప్పినట్లు.. అతను తనకు సపోర్ట్ గా నిలిచినట్లు తెలిపింది. ఇక తన మార్ఫింగ్ వీడియోలను చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన రీతూ.. పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపింది. వారిపైనే కాకుండా సోషల్ మీడియాలో తనను నాతో వస్తావా.. రేట్ ఎంత అని అడిగినవారిపైన కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?